News January 18, 2026

రథ సప్తమికి ఆర్ట్స్ కాలేజీ‌లో డ్రోన్ షో

image

అరసవిల్లి సూర్యనారాయణ దేవస్థానంలో రథసప్తమి వేడుకలు పురస్కరించుకుని శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 23వ తేదీన ప్రతిష్ఠాత్మకంగా డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో జరుగుతుందన్నారు.

Similar News

News February 13, 2026

మందస: రాజవంశీయుడు కన్నుమూత

image

మందస రాజవంశీయులు కేసరి సింగ్ దేవ్ (79) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లోని ఖార్వేలా నగర్‌లో స్వగృహంలో కన్నుమూశారు. కేసరి సింగ్ దేవ్ గతంలో టెరిటోరియల్ ఆర్మీలో అధికారిగా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సైనిక లాంఛనాలతో నిర్వహించారు. ఈయన మృతితో మందసలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సంస్థానానికి చివరి రాజు అయిన రాజమణి రాజ్ దేవ్ ద్వితీయ కుమారుడే కేసరి సింగ్ దేవ్.

News February 13, 2026

తెల్లవారుజామున 3 గం.ల నుంచే శ్రీముఖలింగేశ్వరుడి దర్శనాలు

image

జలుమూరు మండలం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈనెల 15-18 వరకు జరగన్నాయి. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 2 గం.లకు సుప్రభాత సేవ నిర్వహించి, 3 గం.ల నుంచే స్వామి దర్శనం భక్తులకు కల్పిస్తామని ఈవో కొండలరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 7 గం.లకు శిఖర దీపం, 10గం.లకు లింగోద్భవం, అర్ధరాత్రి 12 గం.లకు తిరువీధి కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లను చేశామన్నారు.

News February 13, 2026

శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అసౌకర్యం కలగకూడదు: ఐజీ గోపీనాథ్

image

మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీకాకుళం ఎస్పీ, డీఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమైన ఆలయాల్లో క్యూలైన్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలను ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని సిద్ధం చేయాలన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.