News January 19, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓భద్రాద్రి నుంచి వందేళ్ళ సభకు సీపీఐ శ్రేణులు
✓జిల్లాలో తూనికల శాఖ అధికారి తనిఖీలు
✓జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం
✓వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
✓పాల్వంచ పెద్దమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
✓అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదం ముగ్గురికి గాయాలు
✓కొత్తగూడెం: రామవరంలో రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
✓రేపు ఆళ్లపల్లి, పాల్వంచలో పవర్ కట్
✓ఐటీడీఏ భద్రాచలంలో రేపు గిరిజన దర్బార్

Similar News

News February 8, 2026

13.06% పెరిగిన SBI లాభం

image

SBI బ్యాంకు లాభం 13.06% పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం DEC క్వార్టర్‌లో రూ.21,028 కోట్ల నికర లాభాన్ని పొందింది. మొత్తం ఆదాయంలో 9.7%వృద్ధి సాధించింది. ఏకీకృత అకౌంట్ల ప్రకారం నికర లాభం రూ.21,317 కోట్లుగా నమోదైంది. 9.4% వృద్ధితో నికర వడ్డీ ఆదాయం రూ.41,446 కోట్ల నుంచి రూ.45,190 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం రూ.3,823కోట్లుగా ఉన్న మొండి బకాయిలు రూ.4,458 కోట్లకు చేరినట్టు బ్యాంక్ ఛైర్మన్ తెలిపారు.

News February 8, 2026

బర్డ్ ఫ్లూతో భారీగా కోళ్లు మృతి.. చికెన్ తినొచ్చా?

image

AP: అన్నమయ్య(D) సదుం(M) పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె, కంభంవారిపల్లెల్లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోగా పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. కోళ్ల శాంపిల్స్‌ను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపగా బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు. బర్డ్‌ఫ్లూతో భయాందోళనలు వ్యక్తం అవుతున్న వేళ వారు కీలక సూచనలు చేశారు. 100 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో వేడి చేసిన చికెన్‌, గుడ్లను తినొచ్చని చెప్పారు.

News February 8, 2026

పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు: వరంగల్ కలెక్టర్

image

ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతగా పని చేయాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్‌ను ఆమె పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.