News April 26, 2024
అప్పుడు 2019లో.. మళ్లీ ఇప్పుడు 2024లో
వర్ధన్నపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం సరిగ్గా అదే రోజు.. అంటే 2019 ఏప్రిల్ 24 బుధవారం కూడా ఒకే బైకుపై వెళ్తున్న ఆదిత్య(20), మురళీధర్రావు(17), రాంసాయిలు(17) పంథని గ్రామ శివారులో చెట్టును ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తిరిగి ఐదేళ్ల తర్వాత రనిల్ కుమార్, సిద్ధూ, వరుణ్ తేజ్, గణేశ్లు బైకుపై వెళ్తూ బస్సు ఢీకొని మృతి చెందారు.
Similar News
News October 2, 2024
బతుకమ్మను ఎత్తుకున్న ఎంపీ కడియం కావ్య
హనుమకొండ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. బతుకమ్మను ఎంపీ కడియం కావ్య ఎత్తుకొని కాసేపు బతుకమ్మ ఆడి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, బతుకమ్మ పండుగ వేడుకల్లో తొలిసారి ఎంపీగా పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.
News October 2, 2024
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
పీపుల్స్ ప్లాజాలో సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రకృతిలోని పూలను దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని, బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
News October 2, 2024
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలన విభాగం భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీలు, ఏసీపీలు సీఐలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ మార్గంలోనే నేటి యువత ప్రయాణించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.