News January 19, 2026

తిరుమలలో ఆ మూడు విగ్రహాలు ఎవరివో తెలుసా..!

image

తిరుమల శ్రీవారి ఆలయంలోని తిరుమలరాయ మండపంలో నమస్కారం చేస్తూ ముగ్గురు భక్తుల రాగి విగ్రహాలను ఎప్పుడైనా చూశారా. లాలాఖేమరాము (రాజా తోడరమల్లు), ఆయన తల్లి మాతా మోహనదేవి, భార్య పితాబీబీ. ఆర్కాట్ నవాబు సాదతుల్లాఖాన్ కొలువులో అతని ప్రతినిధిగా కర్నాటకను పర్యవేక్షించిన ప్రధానాధికారి, క్షత్రియవీరుడు తోడరమల్లు. 17వ శతాబ్దంలో మహమ్మదీయులు, ఆంగ్లేయుల నుంచి తిరుమల క్షేత్రాన్ని కాపాడారు.

Similar News

News April 17, 2026

20న జేఈఈ మెయిన్ ఫలితాలు!

image

జేఈఈ మెయిన్-2026 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. jeemain.nta.nic.inలో అప్లికేషన్ నంబర్, బర్త్ డేట్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన సెషన్-2 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా హాజరయ్యారు. NIT, IITలలో ప్రవేశాల కోసం జేఈఈ ఎగ్జామ్స్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.

News April 17, 2026

కామారెడ్డి: ఈ నెల 19న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

image

కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షను ఈ నెల 19 (ఆదివారం) నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉంటుంది. 7వ నుంచి 10వ తరగతి ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. www.tgms.telangana.gov.inలో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

News April 17, 2026

ఉమ్మడి జిల్లా జెడ్పీ సీఈవోగా విజయలక్ష్మి

image

ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సీఈవోగా విజయలక్ష్మి నియమితులయ్యారు. ప్రస్తుతం గుంతకల్లు డీడీవోగా పనిచేస్తున్న ఆమెను జెడ్పీ రెగ్యులర్ సీఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా ఆమె నియామకంపై సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. శుక్రవారం విడుదలైన ఆదేశాల మేరకు ఆమె త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.