News January 19, 2026
న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. షమీ ఉండాల్సిందేమో!

న్యూజిలాండ్తో సిరీస్ కోల్పోయి టీమ్ ఇండియా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ముఖ్యంగా NZ ప్లేయర్ మిచెల్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. సిరీస్లో అతను 352 పరుగులతో విధ్వంసం చేశారు. ఈ క్రమంలో పలువురు స్టార్ బౌలర్ షమీని గుర్తు చేస్తున్నారు. అతడు ఉండుంటే మిచెల్ ఆటలు సాగేవి కావని, గత రికార్డులే అందుకు నిదర్శనమని అంటున్నారు. ఇరువురి మధ్య పోరులో 16 సగటుతో 4 సార్లు ఔట్ చేసి షమీ ఆధిపత్యం ప్రదర్శించారు.
Similar News
News February 15, 2026
తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

తూర్పుగోదావరి జిల్లాలోని స్పెషల్ జ్యుడిషీయల్ సెకండ్ క్లాస్ కోర్టుల్లో 6 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. కోర్టు అసిస్టెంట్స్, కోర్టు అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, 7వ తరగతి, పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://eastgodavari.dcourts.gov.in
News February 15, 2026
అనుకోకుండా జాగరణ చేసినందుకే!

గుణనిధి కథ మహాశివరాత్రి ఉపవాసం, జాగరణల విశిష్టతను తెలుపుతుంది. దురలవాట్లు గల గుణనిధి ఓ శివరాత్రి నాడు ఆహారం దొరకక అనివార్యంగా ఉపవాసం ఉన్నాడు. ప్రసాదం కోసం శివాలయానికి వెళ్తే అక్కడ అందరూ జాగారణ చేస్తూ కనిపించారు. దీంతో గుణనిధి కూడా జాగరణ చేస్తాడు. చివరకు ఆలయంలోనే మరణిస్తాడు. కానీ, తెలియకుండానే ఉపవాసం ఉండి జాగరణ చేయడంతో పాపాలు నశించాయి. మరుసటి జన్మలో నిధుల అధిపతి కుబేరుడిగా జన్మించాడు.
News February 15, 2026
భారత్ 15 ఓవర్లు కూడా ఆడలేదు.. ఇమాద్ ఓవరాక్షన్!

భారత్-పాక్ మ్యాచ్కు ముందు దాయాది మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం ఇండియాపై అక్కసు వెళ్లగక్కారు. శ్రీలంక పరిస్థితుల్లో టీమ్ఇండియా 15 ఓవర్లు కూడా నిలబడలేదని, అక్కడ భారత్లో లాగా చిన్న బౌండరీలు ఉండవంటూ తన నోటి దురుసును బయట పెట్టుకున్నారు. పాక్ స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు తేలిపోతారని, దూకుడుగా ఆడాలని చూస్తే ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ SMలో గట్టిగానే కౌంటరిస్తున్నారు.


