News January 19, 2026
గణతంత్ర పరేడ్లో కీరవాణి నాదం.. తెలుగు వ్యక్తికి దక్కిన గౌరవం!

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత కీరవాణి ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరనుంది. ‘వందేమాతరం’ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్కు సంగీతం అందించే బాధ్యతను ఆయన చేపట్టనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 2500 మంది కళాకారులు ఈ చరిత్రాత్మక ఘట్టంలో భాగం కానున్నారు. ఈ విషయాన్ని కీరవాణి X వేదికగా వెల్లడించారు.
Similar News
News February 21, 2026
70 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech, ME/MTech అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. నెలకు రూ.60,000-రూ.1,80,000 చెల్లిస్తారు. GATE-2026 స్కోరు, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: https://gailonline.com
News February 21, 2026
ABVP Vs SFI: ఏయూలో మరోసారి హైటెన్షన్

AP: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వద్ద <<19173653>>మరోసారి<<>> ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేసిన SFI, AISF కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ మెయిన్ గేటు వద్ద ABVP ఆందోళనకు దిగింది. దీంతో వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. AUలో రెండు రోజుల క్రితం RSS మార్చ్ను SFI అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. SFI-ABVP మధ్య ఘర్షణ జరిగింది.
News February 21, 2026
సోమవారం నిర్వహించే ‘విశేష పూజ’

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం రెండో గంట తర్వాత విశేష సేవ జరుగుతుంది. 14 కలశాలతో మలయప్ప స్వామికి విశేషంగా అభిషేకం నిర్వహిస్తారు. వీటిలో ఏడు కలశాలలో పాలు, పెరుగు, నెయ్యి వంటి ద్రవ్యాలు, మిగిలిన ఏడింటిలో శుద్ధజలం ఉంటాయి. పంచసూక్తాల పఠనం మధ్య తిరుమంజనం జరుగుతుంది. హోమం, పూర్ణాహుతి తర్వాత భక్తులకు వస్త్ర బహుమానం ఇస్తారు. 1991లో ప్రారంభమైన ఈ సేవ లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్నారు.


