News April 26, 2024

ఎర్రగుంట్ల: పట్టాలు దాటుతుండగా వ్యక్తి మృతి

image

పెద్దముడియం మండలం చిన్నపసుపులకి చెందిన గొల్ల శ్రీనివాసులు భార్య తులసి పిల్లలతో కలిసి పుట్టినిల్లైన విజయనగరం వెళ్ళింది. వారికోసం వెళ్లిన శ్రీనివాసులు ఇంటికి వచ్చే క్రమంలో గురువారం అందరితో కలిసి నంద్యాలలో ధర్మవరం రైలు ఎక్కారు. జమ్మలమడుగులో దిగాల్సి ఉండగా మరిచిపోయి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో దిగారు. అక్కడి నుంచి బయటకు వెళ్లే క్రమంలో పట్టాలు దాటుతుండగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని మృతి చెందాడు.

Similar News

News September 8, 2025

వనిపెంట: ఆ నర్సరీలతో నష్టపోతున్న రైతన్నలు..?

image

వనిపెంట ప్రాంతంలో నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా ఇష్టానుసారంగా నర్సరీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యత లేని, కల్తీ విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నర్సరీ యజమానులు కొందరు నాణ్యత లేని విత్తనాల నారును రైతులకు అంటగడుతూ లాభం పొందుతున్నారు. నర్సరీలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News September 8, 2025

కడప జిల్లాలో తెరుచుకున్న ఆలయాలు

image

చంద్రగ్రహణం సందర్భంగా కడప జిల్లాలోని అన్ని ఆలయాలు మూత పడిన విషయం తెలిసిందే. గ్రహణం వీడటంతో ఇవాళ తెల్లవారుజామున ఆలయాలు తెరిచారు. ఒంటమిట్ట కోదండరామాలయంలో టీటీడీ అర్చకులు ఆలయ శుద్ధి చేశారు. తర్వాత సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. జిల్లాలోని ఇతర ఆలయాల్లోనూ దర్శనాలు తిరిగి మొదలయ్యాయి.

News September 8, 2025

ప్రొద్దుటూరు జిల్లా డిమాండ్‌కు MLA మద్దతు

image

ప్రొద్దుటూరు జిల్లా డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈక్రమంలో ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జేఏసీ సభ్యులు పలువురి మద్దతు కూడగడుతున్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆదివారం కలిసి జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. జిల్లాల రీ ఆర్గనైజేషన్ కమిటీ త్వరలో కడప జిల్లా పర్యటనకు వస్తుందని.. అప్పుడు ప్రొద్దుటూరు జిల్లాపై వినతిపత్రం అందజేస్తానని చెప్పారు.