News January 19, 2026

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ పవార్

image

ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు సత్వరమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 43 అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలపైనే 21 దరఖాస్తులు వచ్చాయన్నారు. పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని, అధికారులు విధిగా హాజరై సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు.

Similar News

News February 11, 2026

EXIT POLLS.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలా..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 13 నుంచి 15 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 3 నుంచి 5 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP 1 నుంచి 2 మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.

News February 11, 2026

రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతే లక్ష్యం: కలెక్టర్

image

మచిలీపట్నంలోని ‘మీ కోసం’ వేదికగా కలెక్టర్ బాలాజీ నేతృత్వంలో రెవెన్యూ అధికారుల సమగ్ర సమీక్ష జరిగింది. జిల్లాలో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించి, ప్రజలకు మరింత జవాబుదారీగా సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా 22-ఏ వివాదాల పరిష్కారం, భూ రీ-సర్వే, ఈ-కేవైసీ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. బాధితుల నుంచి వచ్చే అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సూచించారు.

News February 11, 2026

కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం ఎక్కడంటే!

image

కామారెడ్డి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 79.77% పోలింగ్ నమోదయిందని అధికారులు వెల్లడించారు. 5,110 (80.84%) పురుషులు, 5,470 (78.78%) మహిళలు, ఇతరులు 1(100%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో మొదటి సాధారణ ఎన్నికల్లో సైతం ఎల్లారెడ్డిలోని అత్యధికంగా ఓటింగ్ శాతం(2020లో 84.6%) నమోదైంది.