News January 20, 2026

మున్సిపల్ ఎన్నికల వేళ పాలమూరుకు ఇద్దరు మంత్రులు

image

మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ బాధ్యతలను మంత్రి దామోదర రాజనరసింహ, నాగర్‌కర్నూల్ బాధ్యతలను మంత్రి వాకిటి శ్రీహరికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఈ మంత్రులు మంగళవారం నుంచే క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.

Similar News

News February 21, 2026

నిర్మల్: గోదావరి నదిలో మహిళ శవం లభ్యం

image

బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆమె మహారాష్ట్ర కర్కేల్లి గ్రామానికి చెందిన మోతేవార్ అనసూయగా గుర్తించారు. బుధవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 21, 2026

నెల్లూరు: ఫేస్‌బుక్ పరిచయం.. ప్రాణం తీసుకున్న యువకుడు

image

ఫేస్‌బుక్ పరిచయం ఓ యువకుడి ప్రాణాన్ని తీసింది. నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్(26)కు కర్నూలు(D) పత్తికొండకు చెందిన దంపతులు FBలో పరిచయమయ్యారు. చెన్నైలో తనకు హోటల్ ఉందని, కర్నూలులో పెట్టే హోటల్‌లో భాగస్వాములు కావాలని ఆ దంపతులకు చెప్పాడు. పత్తికొండకు వెళ్లి అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఆమెపైనే కన్నేసిన తనతో రావాలంటూ వేధించగా నిరాకరించింది. దీంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 21, 2026

నేడు శ్రీవారి ఆలయాల్లో ‘కూటమి’ పూజలు, సంప్రోక్షణలు

image

AP: వైసీపీ సభ్యులు శ్రీవారి ఫొటోలను శాసనమండలికి తీసుకొచ్చి మహాపచారం చేశారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రెస్‌మీట్‌లు నిర్వహించాలని, నేడు శ్రీవారి ఆలయాల్లో పూజలు, సంప్రోక్షణలు చేయాలని నిర్ణయించారు. వేంకటేశ్వర స్వామి చిత్రాలను అపవిత్రం చేసి జగన్, వైసీపీ సభ్యులు మహాపరాధానికి పాల్పడ్డారని, దీనిపై హిందూ భక్తులకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది.