News January 20, 2026
సిరిసిల్ల: ‘మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి’

పురపాలక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్దతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
Similar News
News March 11, 2026
భద్రాచలం: మావోయిస్టులు.. పోలీసులకు మధ్య కాల్పులు

ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పార్థాపూర్ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్ట్ల మధ్య భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్ట్లు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నిఖిల్ రఖేచా ధ్రువీకరించారు. ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమచారం.
News March 11, 2026
గద్వాల: పోలీసుల సంక్షేమమే లక్ష్యం.. ఎస్పీ ‘దర్బార్’

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం ఏఆర్ పోలీసులతో ‘పోలీస్ దర్బార్’ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను పోలీసులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం, శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు.
News March 11, 2026
ఆ మందులతో లివర్ డ్యామేజీ: అధ్యయనం

ఆయుర్వేదం, ఇతర ప్రత్యామ్నాయ మందుల వాడకంపై తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. 386 రకాల ఉత్పత్తులను పరీక్షించగా 27.7% మందుల్లో స్టెరాయిడ్స్, 31.3% ఉత్పత్తుల్లో జంతు సంబంధిత వ్యర్థాలు ఉన్నట్లు ఇందులో తేలినట్లు ‘ఫ్రాంటియర్స్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ’ ప్రచురించింది. వీటిలో సీసం, ఆర్సెనిక్ వంటి భార లోహాలు మోతాదుకు మించి ఉన్నాయని, వీటివల్ల 39% మందిలో కాలేయం పాడై మరణ ముప్పు పెరుగుతుందని తెలిపింది.


