News January 21, 2026
జగిత్యాల: రైతు గోస పట్టదా? పాలకుల హామీలు నీటి మూటలే!

జిల్లా రైతులను ప్రధాన సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఎన్నికలు ఎన్ని వచ్చినా అన్నదాతలకు ఒరిగిందేమీ లేదు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. ఐతే పసుపు బోర్డుతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అలాగే జిల్లాలో ఉన్న ఒకే ఒక్క చక్కెర ఫ్యాక్టరీ మూత పడింది. కాలువలు మరమ్మతు చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు SRSP నీరు అందటం లేదు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారంచాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News February 22, 2026
సంగారెడ్డి: ‘విదేశీ విద్యా నిధికి దరఖాస్తు చేసుకోవాలి’

విదేశాల్లో చదువు కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీ విద్యానిధి కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేశ్ రెడ్డి శనివారం తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను www.telanganaepass.gov.inలో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వరకు విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.
News February 22, 2026
PDPL: మాజీ మావోయిస్టు కీలక వ్యాఖ్యలు

‘నేను ప్రజల్లోనే ఉన్నా.. ఉంటా’ అని మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ రావు అన్నారు. త్వరలోనే పుట్టిన గడ్డ తెలంగాణకు వస్తానని శనివారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, అడవి నుంచి బయటకు వెళ్లి రాజ్యాంగ బద్దంగానే పోరుడుదామని కమిటీ సభ్యులకు చెబితే.. కొందరు మాత్రమే వ్యతిరేకించారని చెప్పారు. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. కాగా, ఆయనది పెద్దపల్లి జిల్లా.
News February 22, 2026
శగుణం అంటే తెలుసా?

మంచి, శుభప్రదాన్నే శగుణం అంటారు. ఇది సంస్కృత పదం. శుభకార్యాలప్పుడు దైవిక ఆశీస్సులు కోరుతూ బహుమతి రూపేణా శగుణం ఇస్తారు. ముఖ్యంగా వివాహ వేడుకలలో మనం దీన్ని చూడవచ్చు. పెళ్లికి ముందు జరిగే పలు వేడుకల్లో వధువు, వరుడి కుటుంబాలు నగలు, బట్టలు, మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్ వంటివి శగుణంగా ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఇది కేవలం వస్తు మార్పిడి మాత్రమే కాదు! రెండు కుటుంబాల మధ్య బంధాన్ని ఖరారు చేసే పవిత్రమైన ప్రక్రియ.


