News January 21, 2026
సంగారెడ్డి: జిల్లాలో బీజేపీ ప్రభారీల నియామకం

మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రాంచందర్రావు ఆయా మున్సిపాలిటీలకు ప్రభారీలను నియమించారు. సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు ప్రభారీలను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్గౌడ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రభారీగా పైడి ఎల్లారెడ్డి, అందోల్ జోగిపేట మున్సిపాలిటీకి జె.రంగారెడ్డి, నారాయణఖేడ్ ఆలే భాస్కర్ నియమితులయ్యారు.
Similar News
News February 11, 2026
సిరిసిల్ల: వీల్ చైర్లో వచ్చి ఓటేసిన సీనియర్ న్యాయవాది

సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది, వినియోగదారుల సంక్షేమ మండలి మాజీ అధ్యక్షుడు శాంతి ప్రకాష్ శుక్లా వీల్ చైర్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు 80 సంవత్సరాల వయసున్న ఆయన ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ ప్రజాస్వామ్యంపై మక్కువతో చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి ఆయనకు స్థానికంగా ఉన్న పోలీసులు, పోలింగ్ సిబ్బంది సహకరించారు.
News February 11, 2026
ESIC హాస్పిటల్ భిలాయ్లో ఉద్యోగాలు

<
News February 11, 2026
శివరాత్రికి మైపాడు వెళ్తారా..?

మైపాడు బీచ్ వద్ద ఉన్న భారీ శివలింగం మహా శివరాత్రికి సిద్ధమైంది. సముద్ర తీరాన ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఈ లింగాన్ని తీర్చిదిద్దారు. మెట్ల ద్వారా పైకి వెళ్లి అభిషేకం చేసే సౌకర్యం ఉండటంతో.. శివరాత్రి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. సముద్ర స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకునేందుకు పర్యాటకులు ఇక్కడకు ఆసక్తి చూపుతారు. ప్రకృతి ఒడిలో ఈ శివలింగం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ నిలవనుంది.


