News January 21, 2026

ఆదిలాబాద్: JEE మెయిన్స్.. తొలిరోజు 8మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు మ.3 గంటల నుంచి సా.6 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన పరీక్షకు వంద మందికి గాను 93 మంది హాజరై ఏడుగురు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 99 మంది హాజరై.. ఒక్కరు గైర్హాజరయ్యారని పరీక్షల కో-ఆర్డినేటర్, కళాశాల ప్రిన్సిపల్ పున్నారవ్ తెలిపారు.

Similar News

News March 10, 2026

ADB: నేటి INTER పరీక్షకు 385 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని DIEO జాధవ్ గణేష్ కుమార్ తెలిపారు. మొత్తం 8,520 మంది విద్యార్థులకు గాను 8,135 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 292 మంది, ఒకేషనల్ విభాగంలో 93 మంది కలిపి మొత్తం 385 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

News March 10, 2026

ఆదిలాబాద్ సింగం.. ONE YEAR COMPLETE

image

ఆదిలాబాద్ జిల్లా SPగా అఖిల్ మహాజన్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాదయింది. ఈ ఏడాది కాలంలో ప్రజలు సేవలందించడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపారు. క్రైంను అదుపులోపెట్టి మహిళలకు అండగా ఉంటూ దోపిడీదారుల పాలిట సింహ స్వప్నంలా మారారు. శాఖలో మార్పులు, కట్టుదిట్టమైన భద్రత ఉంటే ఇలాంటి ఎస్పీనే ఉండాలంటూ ఆదిలాబాద్ కా షేర్, సింగం అంటూ ప్రజల నుంచి మన్ననలు పొందారు.

News March 9, 2026

ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షకు.. 527 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 9,232 మంది విద్యార్థులకు గాను 8,705 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 399 మంది, ఒకేషనల్ విభాగంలో 128 మంది కలిపి మొత్తం 527 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.