News January 21, 2026
తిరుమలలో ఆ దర్శనాలన్నీ రద్దు

రథసప్తమి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో పలు దర్శన సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, ఎన్ఆర్ఐ, చంటి బిడ్డలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేశారు.
Similar News
News February 11, 2026
సిరిసిల్ల: వీల్ చైర్లో వచ్చి ఓటేసిన సీనియర్ న్యాయవాది

సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది, వినియోగదారుల సంక్షేమ మండలి మాజీ అధ్యక్షుడు శాంతి ప్రకాష్ శుక్లా వీల్ చైర్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు 80 సంవత్సరాల వయసున్న ఆయన ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ ప్రజాస్వామ్యంపై మక్కువతో చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి ఆయనకు స్థానికంగా ఉన్న పోలీసులు, పోలింగ్ సిబ్బంది సహకరించారు.
News February 11, 2026
ESIC హాస్పిటల్ భిలాయ్లో ఉద్యోగాలు

<
News February 11, 2026
శివరాత్రికి మైపాడు వెళ్తారా..?

మైపాడు బీచ్ వద్ద ఉన్న భారీ శివలింగం మహా శివరాత్రికి సిద్ధమైంది. సముద్ర తీరాన ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఈ లింగాన్ని తీర్చిదిద్దారు. మెట్ల ద్వారా పైకి వెళ్లి అభిషేకం చేసే సౌకర్యం ఉండటంతో.. శివరాత్రి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. సముద్ర స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకునేందుకు పర్యాటకులు ఇక్కడకు ఆసక్తి చూపుతారు. ప్రకృతి ఒడిలో ఈ శివలింగం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ నిలవనుంది.


