News January 22, 2026

హనుమాన్‌పేట్‌లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక

image

విజయవాడ హనుమాన్‌పేటలోని ఏపీలోని అన్ని జిల్లాల ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి, విద్యార్థుల పౌరహక్కుల పరిరక్షణకు ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోగా, రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Similar News

News April 11, 2026

NTR: నేడు 3 మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన APSDMA

image

జిల్లాలో శనివారం 3 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. జి.కొండూరు 44.1, ఇబ్రహీంపట్నం 44.1, కంచికచర్ల మండలాలలో 43.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది.

News April 11, 2026

‘దీపం’ లబ్ధిదారులు PNGకి మారినా రాయితీ ఇస్తాం: CM CBN

image

AP: దీపం పథకం లబ్ధిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG)కి మారినా వారికి ఇచ్చే రాయితీని ఖాతాల్లో జమ చేస్తామని CM CBN వెల్లడించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై సమీక్షించిన ఆయన, రాబోయే 6 నెలల్లో 10 లక్షల PNG కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు టార్గెట్‌ను నిర్దేశించారు. శ్రీకాకుళం-కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ పనులు వెంటనే పూర్తయ్యేలా చూడాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఫోన్‌లో కోరారు.

News April 11, 2026

అల్లు అర్జున్ ‘రాకా’.. యాక్టర్ల రెమ్యునరేషన్ ఎంతంటే?

image

అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్ రూ.175కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఫీమేల్ లీడ్‌గా నటిస్తోన్న దీపికా పదుకొనె రూ.25కోట్లు, కీలక పాత్రలో నటిస్తోన్న రష్మిక రూ.5కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాను రూ.700కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల రిలీజ్ చేసిన అల్లు అర్జున్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది.