News January 22, 2026

సిరిసిల్ల మున్సిపాలిటీలో మహిళా రాజ్యమే!

image

సిరిసిల్ల గ్రామ పంచాయతీ నుంచి 1987లో మున్సిపాలిటీగా మారింది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో రుద్ర సత్తెమ్మ చైర్మన్‌గా గెలుపొందారు. ప్రస్తుతం సిరిసిల్ల పురపాలకలో 1.01 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా. 81,959 ఓటర్లకు గాను పురుషులు 39,942, మహిళలు 42,011 ఉన్నారు. మున్సిపల్లో ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు జరగ్గా, 5 సార్లు మహిళలు చైర్మన్ పీఠం కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా చైర్మన్ స్థానం మహిళలకే కేటాయించారు.

Similar News

News March 7, 2026

రేపు కెప్టెన్ సూర్య రిటైర్మెంట్?

image

INDT20 జట్టు కెప్టెన్ సూర్య రేపు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. కివీస్‌తో జరిగే T20WC ఫైనల్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఫామ్ తగ్గడం, వయసు పెరగడం(35 ఏళ్లు), కెరీర్ చివరి దశలో ఉన్నందున రిటైర్మెంట్‌కు ఇదే మంచి తరుణమని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా SKY కెప్టెన్సీలో IND ఒక్క సిరీసూ ఓడిపోలేదు. అయితే బ్యాటర్‌గా విఫలమవుతున్నారు.

News March 7, 2026

8 మంది MLAలకు క్లీన్ చిట్

image

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో తీర్పును ఆయన రిజర్వ్ చేశారు.

News March 7, 2026

దేశంలోనే అతిపెద్ద లొంగుబాటు: రేవంత్

image

TG: దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద మావోయిస్టు <<19321592>>లొంగుబాటు<<>> అని CM రేవంత్ అన్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి సహా అజ్ఞాతంలో ఉన్న మిగతావాళ్లంతా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. గణపతి రక్షణ, ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోలకు ఆరోగ్య, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నామన్నారు. మావోలు లేవనెత్తిన రాష్ట్ర పరిధిలోని అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.