News January 22, 2026
నవజాత గొర్రె పిల్లల మరణాలకు కారణం ఏమిటి?

నవజాత గొర్రె పిల్లల మరణాలు పెంపకందారులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పుట్టిననాటి నుంచి 28 రోజుల వయసు కలిగిన గొర్రె పిల్లలను నవజాత పిల్లలుగా పరిగణిస్తారు. నవజాత పిల్లల మరణాల్లో దాదాపు 35 శాతం అవి పుట్టినరోజే సంభవిస్తాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. గొర్రెల పెంపకందారుల నిర్లక్ష్యం, వ్యాధికారక క్రిములు, సూక్ష్మజీవులు, పరాన్న జీవులు సోకడమే ఈ మరణాలకు కారణమని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News February 17, 2026
VIRAL: ఇస్త్రీ మరకతో ఉన్న షర్టు ఖరీదు రూ.లక్ష!

ఫ్యాషన్ ప్రపంచంలో వింతలకు కొదువ లేదు. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ‘VETEMENTS’ తాజాగా విడుదల చేసిన ఒక షర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇస్త్రీ చేస్తుండగా పొరపాటున చొక్కా కాలితే వచ్చే ‘ఐరన్ బర్న్’ మార్కును వీరు డిజైన్గా మార్చేశారు. దీని ధర $1,139 (సుమారు రూ. లక్ష). ఈ ధరను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి మరక పడితే ఇంట్లో గొడవ చేస్తామని, కానీ ఇదే ఓ ఫ్యాషన్ అయిందంటూ సెటైర్లు వేస్తున్నారు.
News February 17, 2026
నైరుతి మూలలో వాస్తు దోషాలు ఉంటే?

నైరుతి దిశలో వాస్తు లోపిస్తే అది ప్రమాదాలకు నిలయమవుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘తక్కువ ధరకు వస్తుందని ఇలాంటి స్థలాన్ని అస్సలు తీసుకోకూడదు. ఈ దోషం వల్ల కుటుంబ యజమానికి ప్రాణహాని, అకాల మరణాలు సంభవించే అవకాశం ఉంది. తీవ్రమైన వివాదాలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిడి వల్ల జీవితంపై విరక్తి కలిగే పరిస్థితులు ఎదురవుతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన వాస్తు దోషం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 17, 2026
మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

TG: పెరుగుతున్న ఎండల నేపథ్యంలో మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 8AM నుంచి 12:30PM వరకే బడులు నడపాలని ఆదేశించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూళ్లలో 1PM నుంచి 5PM వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొంది. APR 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని పేర్కొన్న విద్యాశాఖ.. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని తెలిపింది.


