News January 22, 2026

సమస్యల పరిష్కారమే దర్బార్ ధ్యేయం: సురేఖ

image

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయంలో 1942 నుంచి దర్బార్ కొనసాగుతోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. దర్బార్ ప్రధాన ఉద్దేశం ఆదివాసీల సమస్యల పరిష్కారమేనని స్పష్టం చేశారు. అటవీ భూములు, పోడు భూముల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతాల్లో రహదారులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

Similar News

News February 10, 2026

కామారెడ్డి: బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలి రాజీనామా

image

కామారెడ్డి జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అనిత మహేష్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 16వ వార్డు కౌన్సిలర్ టికెట్ల కేటాయింపులో తమకు సమాచారం లేకుండా ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. పార్టీలో గుర్తింపు లేనప్పుడు పదవిలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా లేఖను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. ఈ రాజీనామా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

News February 10, 2026

ఇండియా-పాక్ మ్యాచ్.. విమాన టికెట్లకు రెక్కలు

image

T20 ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ విషయంలో <<19097488>>పాక్ యూటర్న్<<>> తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగనున్న కొలంబోకు విమాన టికెట్ల ధరలు భారీగా ఎగిశాయి. ఇండియాతో ఆడతామని పాక్ ప్రకటించిన నిమిషాల్లోనే ఏకంగా రూ.10 వేలు పెరిగాయని సమాచారం. ప్రస్తుతం పోను రాను టికెట్ ధర రూ.60 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌కు ఇంకా 5 రోజులుండటంతో ఈ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

News February 10, 2026

KNR: తుది దశకు చేరిన మున్సిపల్ ‘పోరు’

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సెగ క్లైమాక్స్‌కి చేరింది. ప్రధాన పార్టీలైనా BRS, BJP, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని, బీజేపీ గెలిస్తేనే కేంద్రం నుంచి అధికంగా నిధులు వస్తాయని, పదేళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని బీఆర్ఎస్‌ను గెలిపించాలని ఆపార్టీల నేతలు చెబుతున్నారు. చివరికి ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడలి.