News January 22, 2026
ఖమ్మం: ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు

ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షుడిగా హెచ్చు వెంకటేశ్వరరావును ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న, జాతీయ ఉపాధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్లు ప్రకటించారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన ఈయన ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ 28 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడారన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల హక్కుల కోసం పోరాడుతూ సంఘాన్ని ముందుండి నడిపించాలని కోరారు.
Similar News
News January 25, 2026
ఖమ్మంలో జిల్లాలో ప్రశాంతంగా ‘జేఈఈ మెయిన్స్’

ఖమ్మంలో శనివారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు విడతల్లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో 864 మందికి గాను 860 మంది, మధ్యాహ్నం 863 మందికి 856 మంది హాజరైనట్లు సిటీ కోఆర్డినేటర్ ఆర్ పార్వతిరెడ్డి వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.
News January 25, 2026
రేపటి నుంచే ‘వాహన్’ సేవలు.. శిక్షణపై డీలర్ల అసంతృప్తి!

జిల్లాలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇకపై ‘వాహన్’ పోర్టల్ ద్వారా సాగనుంది. ఖమ్మం, వైరా, సత్తుపల్లి పరిధిలోని 72 షోరూంలలో సోమవారం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. వెబ్సైట్ నిర్వహణపై అధికారుల నుంచి కనీస అవగాహన, శిక్షణ లేకపోవడంతో షోరూం యజమానులు పెదవి విరుస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వినియోగదారులు ఇబ్బంది పడతారని వాపోతున్నారు. అధికారులు శిక్షణ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
News January 25, 2026
ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలు.. BRS ఇన్ఛార్జిలు వీరే..!

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అధిష్టానం ఇన్ఛార్జ్లను నియమించింది. ఏదులాపురం – ఎమ్మెల్సీ తాతా మధు, మధిర – మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును నియమించారు. అలాగే వైరా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, సత్తుపల్లి – కె.నాగభూషణం వ్యవహరించనున్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో నేతలను సమన్వయం చేస్తూ పార్టీ గెలుపునకు కృషి చేయనున్నారు.


