News January 23, 2026

వసంత పంచమి రోజు పఠించాల్సిన మంత్రాలివే..

image

చదువుల తల్లి ఆశీస్సుల కోసం ఈరోజు ‘సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం’ పఠించడం అత్యంత ఫలప్రదం. విద్యార్థులు ‘సరస్వతి నమస్తుభ్యం’ శ్లోకాన్ని 108 సార్లు జపించాలి. మేధాశక్తి పెరగడానికి ‘ఓం హ్రీం ఐం సరస్వత్యై నమః’ అనే బీజాక్షర మంత్రాన్ని ధ్యానించాలి. గ్రహ దోషాలు, బుధ గ్రహ దోషం ఉన్నవారు సరస్వతీ కవచం పఠించడం వల్ల వాక్చాతుర్యం లభిస్తుంది. భక్తితో ఈ మంత్రాలను స్మరిస్తే ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో విజయం లభిస్తుంది.

Similar News

News March 13, 2026

IPL: ఆ జట్టులోకి స్టార్ ప్లేయర్

image

బంగ్లాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను KKR టీమ్ తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి ప్లేస్‌లో జింబాబ్వే పేస్ సంచలనం ముజరబానిని తీసుకున్నట్లు ప్రకటించింది. ఇటీవల T20 WCలో అతడు అద్భుతంగా రాణించారు. 13 వికెట్లు తీసి జింబాబ్వే సూపర్-8కు చేరడంలో కీలకపాత్ర పోషించారు. ఓవరాల్‌గా 80 T20Iల్లో 90 వికెట్లు పడగొట్టారు. IPL ఆఫర్‌తో ముజరబాని పాకిస్థాన్ సూపర్ లీగ్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నారు.

News March 13, 2026

విజయ్ ఎన్డీఏలో చేరతారా?

image

తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న TVK చీఫ్ విజయ్ రేపటి ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై CBI విచారణకు హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నా.. NDAతో పొత్తుపై చర్చించేందుకు హస్తినకు వెళ్తున్నట్లు తమిళనాట చర్చ నడుస్తోంది. విజయ్ NDAలో చేరేలా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేటి పార్టీ మీటింగ్‌లోనూ కొందరు TVK నేతలూ కమలదళంతో పొత్తుకే మొగ్గు చూపారట.

News March 13, 2026

PHOTO GALLERY: ‘మూసీ’ డిజైన్లు చూశారా?

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. తొలిదశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును పూర్తి చేయనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ‘మూసీ ఇన్వైట్స్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. తాజాగా ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు రిలీజ్ అయ్యాయి. పైన గ్యాలరీలో వాటిని చూడొచ్చు.