News January 23, 2026

నేడు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

image

AP: రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఇవాళ ప్లాట్లు కేటాయించేందుకు CRDA ఏర్పాట్లు చేసింది. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా ఇ-లాటరీ ద్వారా అందజేయనుంది. మొత్తం 15 గ్రామాల్లోని 291 మందికి స్థలాలు ఇవ్వనుంది. 14 గ్రామాల రైతులకు 11AMకు, ఉండవల్లిలో మెట్టభూములిచ్చిన వారికి 3PMకు కేటాయించనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చిన, ఉండవల్లిలో జరీబు భూములిచ్చిన రైతులకు త్వరలో ప్లాట్లు ఇవ్వనుంది.

Similar News

News March 7, 2026

వాహనం తీస్తున్నారా? ఓ సారి చెక్ చేయండి!

image

ఎండ వేడిమికి మూగజీవాలు చల్లదనం కోసం ఆగి ఉన్న వాహనాల కింద తలదాచుకుంటుంటాయి. వాహనదారులు గమనించకుండా బండిని స్టార్ట్ చేసి ముందుకు తీయడం వల్ల ఇవి చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడటం, ప్రాణాలు కూడా కోల్పోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి వాహనం తీసే ముందు ఒక్కసారి కింద ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. అలాగే మిద్దెపై, ఆరుబయట పక్షుల కోసం నీటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

News March 7, 2026

సిలిండర్ ధరల పెంపు.. కేంద్రంపై ఖర్గే ఫైర్

image

గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కేంద్రంపై విరుచుకుపడ్డారు. డొమెస్టిక్‌పై ₹60, కమర్షియల్ సిలిండర్‌పై ₹115 పెంచడం సామాన్యులకు భారమేనని మండిపడ్డారు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఇవ్వకుండా ఇప్పుడు ద్రవ్యోల్బణంతో పీడిస్తున్నారని విమర్శించారు. దేశంలో గ్యాస్, ఎరువుల కొరతను తీర్చలేని మోదీ ప్రభుత్వం అన్నీ బాగున్నాయంటూ ప్రగల్భాలు పలుకుతోందని X వేదికగా ఎద్దేవా చేశారు.

News March 7, 2026

పాక్‌లో భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు

image

ఇరాన్-US యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వం లీటర్‌పై ఏకంగా 55 PKR(17 శాతం) పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 266.17 PKR నుంచి 321.17 PKRకు పెరిగింది. హైస్పీడ్ డీజిల్ ధర లీటర్‌కు 280.86 నుంచి 335.86కి(20%) ఎగిసింది. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని పాక్ పెట్రోలియం మంత్రి మాలిక్ అన్నారు. ఇండియాలోనూ <<19316911>>గ్యాస్ ధరలు<<>> పెరిగిన విషయం తెలిసిందే.