News January 23, 2026
నల్గొండ మీదుగా ‘అమృత్ భారత్’ రైలు

నల్గొండ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. HYD చర్లపల్లి నుంచి కేరళలోని తిరువనంతపురానికి నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల మీదుగా ఈ రైలు వెళ్లనుంది. వారంతపు సర్వీసుగా నడిచే ఈ రైలులో 11జనరల్, 8స్లీపర్ కోచ్లతో పాటు దివ్యాంగుల కోసం రెండు ప్రత్యేక బోగీలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. తక్కువ ఛార్జీతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
Similar News
News January 25, 2026
NLG: ఈయన జర్నీ ఎందరికో స్ఫూర్తి

దళిత కుటుంబంలో జన్మించినా తన తలరాతను తానే రాసుకోవాలనే దృఢ సంకల్పమే పి.చంద్రయ్యను ఉన్నత స్థానానికి చేర్చింది. చదువును ఆయుధంగా మలుచుకొని, అనేక అవరోధాలను అధిగమిస్తూ ఆయన మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్గా నియమితులయ్యారు. శాలిగౌరారం (M) ఇటుకల పహాడ్ అనే చిన్న గ్రామం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఆయన ప్రయాణం సాగింది. 31 ఏళ్ల నిరంతర కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసమే చివరకు ఆయనను ఐఏఎస్ చేసింది.
News January 25, 2026
నల్గొండ: మున్సిపల్ పోరు.. ఇన్ఛార్జిలు వీరే..

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండ కార్పొరేషన్కు MLC కోటిరెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించింది. అలాగే నందికొండకు యుగేంధర్ రావు, హాలియాకు విజయసింహారెడ్డి, దేవరకొండకు పాల్వాయి స్రవంతి, మిర్యాలగూడకు లింగయ్య యాదవ్, చండూరుకు వెంకటనారాయణ గౌడ్, చిట్యాలకు చాడ కిషన్ రెడ్డిలను ఇన్ఛార్జిలుగా ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించే బాధ్యతను వీరికి అప్పగించింది.
News January 25, 2026
NLG: ఇక నియోజకవర్గంలోనే యూరియా బుకింగ్

రైతుల ఇబ్బందులను తీర్చేందుకు వ్యవసాయ శాఖ నియోజకవర్గ స్థాయిలోనే ప్రత్యేక యాప్లో యూరియా బుకింగ్ చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆ యాప్లో స్వల్ప మార్పులు చేర్పులు చేసింది. దీంతో నియోజకవర్గ పరిధి యాప్లోనే యూరియా బుక్ చేసుకునేలా శనివారం నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 4,38,529 యూరియా బస్తాలను కొనుగోలు చేశారు.


