News January 23, 2026
రాష్ట్రపతితో విందుకు సిక్కోలు విద్యార్థినికి ఆహ్వానం

శ్రీకాకుళం మండలం ఇప్పిలి జడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇప్పిలి సంజనకు రాష్ట్రపతితో విందు చేసేందుకు ఆహ్వానం అందింది. శుక్రవారం పాఠశాల హెచ్ఎం సుజాత ఈ విషయాన్ని చెప్పారు. విద్యార్థిని సంజన గత మూడేళ్లుగా ప్రాజెక్టులు తయారు చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్కు పంపిస్తోంది. ఆమె తయారు చేసిన డ్యూయల్ సోలార్ ట్రాకర్ సిస్టం ప్రాజెక్ట్ ఆ సంస్థను ఆకర్షించింది. ఈమె ప్రతిభను గుర్తించి ఈ అవకాశం కల్పించింది.
Similar News
News March 25, 2026
శ్రీకాకుళం: డయేరియా ఘటనలో సస్పెండ్.. మళ్లీ ఆయనే కమిషనర్

నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావును ప్రభుత్వం మళ్లీ నియమించింది. విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే తాగునీటి కలుషితం జరిగి డయేరియా ప్రబలిన నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రిసభ్య కమిటీ నివేదికలో ఆయన వైఫల్యం లేదని తేలింది. దీంతో ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసి పునర్నియామక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
News March 25, 2026
శ్రీకాకుళం: మిట్టి కేఫ్కు ఏప్రిల్ 2లోగా దరఖాస్తు

శ్రీకాకుళం జిల్లా కోర్టు సముదాయంలోని ఫోర్ కోర్ట్స్ భవనం సెల్లార్లో ‘మిట్టీ కెఫే’ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం తెలిపింది. సామాజిక బాధ్యతతో ఈ కెఫేను కేవలం దివ్యాంగుల ద్వారానే నిర్వహించేలా జిల్లా ప్రధాన న్యాయస్థానం మంగళవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న అర్హులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 2లోగా సమర్పించాలని కోరారు. నిర్వహకులు విద్యుత్ ఛార్జీలను స్వయంగా భరించాల్సి ఉంటుంది.
News March 25, 2026
శ్రీకాకుళం: మిట్టి కేఫ్కు ఏప్రిల్ 2లోగా దరఖాస్తు

శ్రీకాకుళం జిల్లా కోర్టు సముదాయంలోని ఫోర్ కోర్ట్స్ భవనం సెల్లార్లో ‘మిట్టీ కెఫే’ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం తెలిపింది. సామాజిక బాధ్యతతో ఈ కెఫేను కేవలం దివ్యాంగుల ద్వారానే నిర్వహించేలా జిల్లా ప్రధాన న్యాయస్థానం మంగళవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న అర్హులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 2లోగా సమర్పించాలని కోరారు. నిర్వహకులు విద్యుత్ ఛార్జీలను స్వయంగా భరించాల్సి ఉంటుంది.


