News January 23, 2026
నిన్న విజయసాయి రెడ్డి.. మిథున్ రెడ్డి

AP: మద్యం కుంభకోణం కేసులో ED విచారణకు YCP MP మిథున్రెడ్డి హాజరయ్యారు. ఇదే కేసులో నిన్న విజయసాయిరెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించారు. హైదరాబాద్లోని ED కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్కు సంబంధించిన పూర్తి సమాచారం రాజ్ కసిరెడ్డికే తెలుసని.. మిథున్ రెడ్డి కోరిక మేరకు ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేశానని నిన్న విజయసాయి తెలిపారు. ఈ నేపథ్యంలో నేటి విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.
Similar News
News February 14, 2026
వరంగల్: ప్రత్యర్థుల ఎగతాళి నుంచి మున్సిపల్లో గెలుపు వరకు!

తన రాజకీయ అనుభవం అంత లేని యువతి చేతిలో ఓటమి పాలయ్యావంటూ ప్రత్యర్థులు చేసే ఎగతాళి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఉపశమనం కలిగినట్లయింది. తొర్రూర్ మున్సిపాలిటీలో 16 వార్డులకు ఎన్నికలు జరిగితే , BRS 9, కాంగ్రెస్ 7 వార్డులను కైవసం చేసుకున్నాయి. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎర్రబెల్లి, విజయం సాధించకపోతే మరో అపవాదును మూట గట్టుకునే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
News February 14, 2026
షుగర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే?

షుగర్తో బాధపడే మహిళల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల గర్భం దాల్చడం కష్టమవుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్ కావడం, శిశువులో అవకరాలు ఏర్పడటం వంటి సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందే షుగర్ అదుపులో ఉంచుకోవాలి. దీనివల్ల అండం సరిగ్గా విడుదలవ్వడంతో పాటు తల్లీబిడ్డ ఆరోగ్యం బావుంటుందని సూచిస్తున్నారు.
News February 14, 2026
జాగ్రత్త.. ఓయో రూమ్స్కు ఆఫర్లు అంటూ..

వాలంటైన్స్ డే సందర్భంగా గతంతో పోలిస్తే ఈసారి హోటల్ రూమ్ బుకింగ్స్ 170% పెరిగిన విషయం తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకొని ‘ఓయో’ ఆఫర్ల పేరుతో రూమ్స్ బుకింగ్స్పై డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. కొందరు కూపన్లు అంటూ సోషల్ మీడియాలో పలు సైట్లు ఓపెన్ చేయాలని టెంప్ట్ చేస్తున్నారు. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని, లింక్స్ ఓపెన్ చేస్తే వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్లిపోతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


