News January 23, 2026

కేసీఆర్ చుట్టే ప్రశ్నలు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRను HYD సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ బృందం రెండు గంటలుగా ప్రశ్నిస్తోంది. కాగా పదే పదే కేసీఆర్ చుట్టే ఆయన్ను ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌కు పర్మిషన్ ఇచ్చిందెవరు? ఎవరు చేయమని చెప్పారు? అనే ప్రశ్నలతో పాటు ట్యాపింగ్‌కు కేసీఆర్ కారణమా? అనే యాంగిల్‌లో ప్రశ్నలు సంధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Similar News

News February 20, 2026

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 20 ఫిర్యాదులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకారరావు ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 20 వినతులు అందాయి. పట్టణ ప్రణాళికా విభాగంపై వచ్చే ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారానికి ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అత్యధికంగా నార్త్ జోన్ నుంచి 6 వినతులు రాగా.. అధికారులు వెంటనే స్పందించి వీటిని పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

News February 20, 2026

అసలు కడితే చాలు.. వడ్డీ మాఫీ: CS

image

AP: SC కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకున్న లబ్ధిదారులకు వాటి చెల్లింపులో GOVT వెసులుబాటు కల్పించింది. NSFDC, NSKFDC పథకాల కింద వాహనాలు, స్వయం ఉపాధి కోసం సంస్థ ₹260CR లోన్ ఇవ్వగా వడ్డీ ₹40CR అయ్యింది. APRలోగా అసలు కడితే వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తామని CS విజయానంద్ ప్రకటించారు. సచివాలయంలో రుణాల రికవరీని సమీక్షించిన ఆయన వసూళ్లపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలన్నారు. ‘మనమిత్ర’పై అవగాహన కల్పించాలన్నారు.

News February 20, 2026

ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్

image

నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాలో క్యాష్ పేమెంట్స్ ఏప్రిల్ 1 నుంచి నిలిచిపోయే అవకాశం ఉందని PIB వెల్లడించింది. అప్పటి నుంచి ఫాస్టాగ్, UPI ద్వారా మాత్రమే చెల్లింపులు ఉంటాయని తెలిపింది. ఇందుకు తగ్గట్లుగా ప్రయాణికులు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. హైవేలపై అడ్డంకులు లేని ప్రయాణాన్ని కల్పించడం, టెక్నాలజీని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.