News January 23, 2026

వనపర్తి: ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు: కలెక్టర్

image

ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో దానిని సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం (జనవరి 25) పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేశారు. కులమతాలకు, ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News April 18, 2026

హైకోర్టు జడ్జిని కలిసిన నెల్లూరు SP

image

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నెల్లూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ కే.సురేశ్ రెడ్డిని ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లాకు విచ్చేసిన ఆయన జిల్లాలోని అన్ని కోర్టుల న్యాయాధికారులతో డిస్టిక్ కోర్టులో వర్క్ షాప్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలో న్యాయ పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు పోలీసు శాఖ తరఫున తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.

News April 18, 2026

ఏపీలో ప్రతిపక్షమేది?

image

ఏపీలో ఉన్న మూడు పెద్ద ప్రాంతీయ పార్టీలు టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తు పెట్టుకోగా.. జగన్ పొత్తు లేకపోయినా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ BJPకి వ్యతిరేకంగా ఉన్నా దానికి పెద్దగా ప్రజల మద్దతు దక్కడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సౌత్ రాష్ట్రాలన్నీ ఒక దారిలో ఉంటే ఏపీది మరో దారి. మరి ఏపీలో ప్రతిపక్షమేది?

News April 18, 2026

GWL: దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక గ్రీవెన్స్

image

దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు. గ్రీవెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, ఉపకరణాల పంపిణీ, సదరం సర్టిఫికెట్లు తదితర సమస్యలు పరిష్కరిస్తామన్నారు.