News April 27, 2024
UPDATE.. NZB: రెండు కుటుంబాల్లో విషాదం

కమ్మర్ పల్లి నుంచి బడాపహాడ్కు36 మందితో వెళ్తున్న డీసీఎం బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ట్రైనీ ఐపీఎస్ చైతన్య వివరాల ప్రకారం.. రెంజర్ల నర్సయ్య కుటుంబం మెుక్కు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి డీసీఎంలో బడాపహాడ్ బయలుదేరారు. డ్రైవర్ అతి వేగంతో వాహానాన్ని నడపడంతో కోత్తపేట వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో వసంత(30), శ్యాంసుందర్ (40) అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News September 12, 2025
ఈనెల 10 నుంచి రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచి 17 వరకు పోరాట విశిష్టతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలో సదస్సులు, చర్చాగోష్ఠులు నిర్వహించాలన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేపట్టాలని కోరారు.
News September 11, 2025
NZB: కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తే క్రిమినల్ కేసులు

నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకో, ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలులేదని రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు. ఎటువంటి నిరసన కార్యక్రమాలు ఉన్న నిజామాబాద్ ఏసీపీ అనుమతితో ధర్నాచౌక్, ఓల్డ్ కలెక్టరేట్ ప్రాంతంలో చేసుకోవాలన్నారు. ఎవరైనా IDOC ఎదుట నిరసన కార్యక్రమాలు జరిపితే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News September 11, 2025
NZB: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నవీపేటలోని సిరన్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. లబ్దిదారులను కలిసి, ఇంటి నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. గ్రామంలో 93 ఇళ్లు మంజూరు కాగా, 69 గ్రౌండింగ్ అయ్యాయని, 12 ఇళ్లు స్లాబ్ పూర్తి అయినట్లు చెప్పారు.