News January 24, 2026

ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ నెల 25న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలుగ జేయుటకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువతను ఇందులో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Similar News

News April 20, 2026

GNT: ఇస్రో ‘యువికా’కు జిల్లా విద్యార్థినుల ఎంపిక.. కలెక్టర్ ప్రశంసలు

image

జాతీయ స్థాయిలో ఇస్రో నిర్వహించిన ‘యువికా’ యంగ్ సైంటిస్ట్ అవార్డులకు ఎంపికైన జిల్లా విద్యార్థినులను కలెక్టర్ సాయి కాంత్ వర్మ అభినందించారు. ఫిరంగిపురం (M) వేములూరిపాడుకు చెందిన జ్యోతిర్మయి, వట్టిచెరుకూరు (M) ముట్లూరుకు చెందిన సుస్మితా చంద్ ఈ గౌరవం దక్కించుకున్నారు. సోమవారం DEO సలీం భాషాతో కలిసి కలెక్టరేట్‌లో వారు కలెక్టర్‌ను కలిశారు. విద్యార్థినుల ప్రతిభను కలెక్టర్ ప్రత్యేకంగా కొనియాడారు.

News April 20, 2026

పట్టాలెక్కని ముఖ్య అమరావతి ప్రాజెక్టులు

image

అమరావతిలో కీలక నిర్మాణాలెవీ ఇంకా ప్రారంభం కాలేదు. ORR, IRR, విజయవాడ మెట్రో, విమానాశ్రయం, రైల్వే లైన్ వంటి ప్రాజెక్టులు ముందుకు సాగలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ టెండర్లు, భూసేకరణ దశల్లోనే ఉన్నాయి. రాజధాని అభివృద్ధికి ఈ ప్రాజెక్టులే అత్యంత కీలకం. ఇవి పట్టాలెక్కితేనే నగర రవాణా మెరుగుపడుతుందన్నారు. ప్రణాళికలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు ఇంకా మొదలు కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News April 20, 2026

పట్టాలెక్కని ముఖ్య అమరావతి ప్రాజెక్టులు

image

అమరావతిలో కీలక నిర్మాణాలెవీ ఇంకా ప్రారంభం కాలేదు. ORR, IRR, విజయవాడ మెట్రో, విమానాశ్రయం, రైల్వే లైన్ వంటి ప్రాజెక్టులు ముందుకు సాగలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ టెండర్లు, భూసేకరణ దశల్లోనే ఉన్నాయి. రాజధాని అభివృద్ధికి ఈ ప్రాజెక్టులే అత్యంత కీలకం. ఇవి పట్టాలెక్కితేనే నగర రవాణా మెరుగుపడుతుందన్నారు. ప్రణాళికలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు ఇంకా మొదలు కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.