News January 24, 2026
కాగజ్నగర్లో విషాదం.. భవానీ మృతి

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పరిధి భట్టుపల్లి గ్రామంలో జరిగిన <<18938568>>రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన<<>> రామగోని భవానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందిందని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదం అనంతరం స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా గాయాలు తీవ్రమవడంతో ప్రాణాలు నిలువలేదు. భవానీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 11, 2026
బడ్జెట్ సమావేశాలకు విజయనగరం ఎమ్మెల్యేలు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీకు చేరుకున్నారు. జిల్లాలోని సాగునీరు, తాగునీటి సమస్యలతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధులు, హామీల అమలు, ఆసుపత్రులు, రోడ్ల అభివృద్ధికి నిధుల కేటాయింపు, నిరుద్యోగుల సమస్యలపై ప్రజాప్రతినిధులు గళమెత్తాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
News February 11, 2026
పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

ప్రస్తుతకాలంలో పిల్లలు, యుక్తవయస్సు వారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో BP ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో BP ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి BP చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.
News February 11, 2026
పిల్లల్లో బీపీ ఉంటే ఎన్నో దుష్ప్రభావాలు

దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు గుండె కండరం మందం అయి గుండె వైఫల్యానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. కిడ్నీలో రక్తనాళాలు దెబ్బతిని, వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవ్వచ్చు. కంట్లోని రెటీనా దెబ్బతినడం, మెదడుకు రక్త సరఫరా చేసే నాళాలు దెబ్బతిని తలనొప్పి, తలతిప్పు తలెత్తచ్చంటున్నారు. అంతేకాకుండా, రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ ముంచుకురావొచ్చని వివరిస్తున్నారు.


