News January 24, 2026

షోరూంలోనే రిజిస్ట్రేషన్.. నేటి నుంచే అమల్లోకి

image

TG: వాహనాల రిజిస్ట్రేషన్ కోసం RTO ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు నేటితో ముగియనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానం నేటి నుంచి అమల్లోకి వస్తోంది. నిన్న మాదాపూర్‌లో చేసిన ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఇకపై బండి కొన్న షోరూమ్‌లోనే ఫొటోలు, డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి అక్కడికక్కడే నంబర్ పొందొచ్చు. RC నేరుగా ఇంటికే పోస్టులో వచ్చేస్తుంది.

Similar News

News February 18, 2026

హిందువులు ముగ్గురు పిల్లల్ని కనాలి: భాగవత్

image

దేశంలో హిందువుల జనాభా తగ్గుతోందని RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘హిందువులను శక్తిమంతం చేయాలి. ఇప్పుడు ఎలాంటి ముప్పు లేదు. కానీ అప్రమత్తత అవసరం’ అని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. చొరబాటుదారులను గుర్తించి పంపేయాలని, ఉపాధి కల్పించకూడదని అన్నారు.

News February 18, 2026

ఆస్ట్రేలియా ఔట్.. వరుసగా మూడో సారి!

image

వరుస ఓటములతో టీ20 WC సూపర్-8 రేసు నుంచి ఆస్ట్రేలియా <<19167885>>నిష్క్రమించడం<<>> తెలిసిందే. సెమీఫైనల్ దాకా చేరకుండా ఆ జట్టు వైదొలగడం వరుసగా మూడో సారి. 2021లో ఆసీస్ ఛాంపియన్‌గా నిలిచింది. కానీ 2022లో సూపర్-12, 2024లో సూపర్-8 దశలోనే ఇంటిదారి పట్టింది. 2024లో అఫ్గాన్ దెబ్బకొడితే, ఈసారి జింబాబ్వే షాకిచ్చింది. దీంతో లీగ్ దశలో ఇంకా ఓ మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమణ తప్పలేదు.

News February 18, 2026

మెదక్ కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

image

TG: న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారని ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. అనంతరం తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలిపేసింది. అప్పీల్ చేసుకునేందుకు కలెక్టర్‌కు గడువిచ్చింది.