News January 24, 2026

తిరుమలలో 14 రకాల అన్నప్రసాదాల పంపిణీ

image

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం TTD భక్తుల కోసం 14 రకాల అన్నప్రసాదాలను సిద్ధం చేస్తుంది. గ్యాల‌రీల్లోని భ‌క్తులంద‌రికీ 85 ఫుడ్ కౌంట‌ర్ల ద్వారా ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు అన్నప్ర‌సాదాలు నిరంతరాయంగా అందేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. వివిధ విభాగాలతో పాటు మాడ వీధులలో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 3700 మంది శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు వినియోగించనున్నారు.

Similar News

News February 7, 2026

విశాఖ: ఒకే ఒక్కడు.. 26 కేసుల్లో నిందితుడు

image

విశాఖ నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అచ్చి మహేష్ రెడ్డిని గాజువాక క్రైమ్, సీసీఎస్, మల్కాపురం పోలీసులు కలిసి అదుపులోకి తీసుకున్నారు. పెందుర్తి-10, గాజువాక-8, మల్కాపురం-2 కేసులతోపాటు ఇతర ప్రాంతాల్లో మరో ఆరు ఇతనిపై ఉన్నాయి. నిందితుడి నుంచి కేజీన్నార బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, BMW కారు, బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మరికాసేపట్లో పూర్తి వివరాలు కమిషనర్ వెల్లడించునున్నారు.

News February 7, 2026

400 సీట్లుకు దరఖాస్తు చేసుకోండి: డిప్యూటీ డైరెక్టర్

image

జిల్లాలో గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మంగదయ్య శనివారం తెలిపారు. రాజవొమ్మంగి(బాలికలు ), రంపచోడవరం(బాలురు, బాలికలు), కూనవరం(బాలికలు ), అడ్డతీగల(బాలురు) పాఠశాలల్లో 400 ఖాళీలు ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయబడతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి చదువుతున్న st విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈ నెల 28లోగా అప్లై చేసుకోవాలన్నారు.

News February 7, 2026

ఎట్టకేలకు ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం ఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్

image

రూ. 28 లక్షల లంచం డిమాండ్ చేసిన కేసులో పరారీలో ఉన్న కొత్తగూడెం ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ACBఅధికారులు అరెస్ట్ చేశారు. జనవరి 3న రేంజర్ రాజేందర్ రూ.3.50లక్షలు తీసుకుంటూ దొరికినప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. వైజాగ్‌లో ఆమెను ACB అదుపులోకి తీసుకుంది. నేడుకోర్టులో ప్రవేశపెట్టనుంది. టన్ను యూకలిప్టస్ కర్రపై రూ. 90 చొప్పున లంచం డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది.