News January 24, 2026
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: మంత్రి గొట్టిపాటి

AP: వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఇప్పటికే యూనిట్కు 13 పైసలు ట్రూ డౌన్ చేశామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో యూనిట్పై రూ.1.19 తగ్గించి రూ.4కే ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.5.19 ఉండేదని, అందులో 29 పైసలు తగ్గించామని చెప్పారు. మరో 90 పైసలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.
Similar News
News February 3, 2026
8 మంది ఎంపీల సస్పెన్షన్.. లోక్సభ రేపటికి వాయిదా

విపక్ష ఎంపీల ఆందోళనల నేపథ్యంలో లోక్సభ రేపటికి వాయిదా పడింది. తనపై పేపర్లు విసిరిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సెషన్ మొత్తం వారిపై సస్పెన్షన్ అమల్లో ఉండనుంది. వీరిలో తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్తోపాటు హిడీ ఈబెన్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్ ఉన్నారు.
News February 3, 2026
2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ: కేటీఆర్

TG: నిరుద్యోగుల ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి తగలడం ఖాయమని KTR హెచ్చరించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా సీఎం రేవంత్ ముఖం చాటేశారని ఫైరయ్యారు. అలాగే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారని మండిపడ్డారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తానని చెప్పిన మాట అటకెక్కిందని దుయ్యబట్టారు. 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని ప్రజలు తెలుసుకున్నారన్నారు.
News February 3, 2026
ఈనెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు!

TG: CM రేవంత్ సోమవారం రాత్రి వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. బడ్జెట్ సన్నాహక సమీక్షలు, శాఖల వారీ బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులను పరిశీలించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద వచ్చే నిధులపై సమీక్షించారు. కాగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెల చివరి వారంలో నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు. వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం.


