News January 24, 2026

విష్ణుమూర్తికి నైవేద్యం ఏ పాత్రలో పెట్టాలి?

image

విష్ణువుకు నైవేద్యం సమర్పించడానికి రాగి పాత్ర శ్రేష్టం. పూర్వం విష్ణు భక్తుడైన గుడాకేశుడు తన శరీరం లోహంగా మారాలని కోరుకున్నాడు. స్వామి అనుగ్రహంతో రాగిగా మారాడు. తన భక్తుని శరీర రూపమైన రాగి పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడం విష్ణువుకు ప్రీతికరం. శాస్త్రీయంగా కూడా రాగికి బ్యాక్టీరియాను నశింపజేసే గుణం, రోగనిరోధక శక్తిని పెంచే స్వభావం ఉంది. అందుకే దేవాలయాల్లో రాగి పాత్రల్లోనే తీర్థం ఇస్తుంటారు.

Similar News

News February 19, 2026

ఢిల్లీ AI సమ్మిట్‌లో బిల్ గేట్స్‌ స్పీచ్ రద్దు

image

ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో బిల్‌ ‌గేట్స్ ప్రసంగం రద్దయినట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. వివాదాల దృష్ట్యా సదస్సు ప్రాధాన్యం దెబ్బతినొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో ఫౌండేషన్ ప్రతినిధి అంకుర్ వోరా ప్రసంగించనున్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌’లో బిల్‌ గేట్స్ పేరున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఆయన నుంచి దూరం పాటిస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి.

News February 19, 2026

అష్టలక్ష్మి: ధాన్యలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలంటే?

image

ధాన్యలక్ష్మి దేవి ఆరాధనలో నీలవర్ణం వస్త్రం ఉంచి, పచ్చని పూలతో పూజ చేయాలి. ధాన్యలక్ష్మి వ్యవసాయానికి, ఆహారానికి అధిదేవత. పచ్చని పూలు ప్రకృతికి, జీవకళకు సంకేతం. మనింట్లో ఎప్పుడూ ఆహారానికి లోటు లేకుండా ఉండాలని ఈ దేవిని ప్రార్థిస్తారు. నీలవర్ణం అనంత ఆకాశాన్ని, స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఈ పద్ధతిలో పూజించడం వల్ల రైతులు పంటలు బాగా పండుతాయని, సాధారణ ప్రజలు ఆకలి బాధలు లేకుండా సుభిక్షంగా ఉంటారని నమ్మకం.

News February 19, 2026

నువ్వుల సాగు.. కాండంకుళ్లు తెగులు నివారణ

image

కాండంకుళ్లు తెగులు ఆశించిన నువ్వుల పంట కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. వేర్లను చీల్చితే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోయి, చనిపోతాయి. అధిక తేమ పరిస్థితులు ఉన్నప్పుడు కాండంకుళ్లు తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి.