News January 24, 2026

ఏలూరు: 2018లో మొదలైన హత్యాకాండ..!

image

ఏలూరుకు చెందిన వెల్లంకి సింహాద్రి, విజయవాడకు చెందిన షేక్ అమనుల్లా బేగ్ మిత్రులు. వీరు జల్సాలు చేయడానికి ఈజీ మనీ సంపాదనపై పడ్డారు. చిన్న చిన్న దందాలతో వచ్చే చిల్లర చాలక మనుషుల ప్రాణాలు తీయడానికి నిర్ణయించుకున్నారు. మొదటిసారి 2018లో ముసునూరు (M) గోపవరానికి చెందిన ఉమామహేశ్వరరావును చంపడానికి స్కెచ్ వేశారు. బేగ్ తయారు చేసిన సైనైడ్‌ను సింహాద్రి ప్రసాదంలో కలిపి ఉమామహేశ్వరరావుకు ఇచ్చాడు. (1/2)

Similar News

News February 14, 2026

డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ

image

అక్రమ సరోగసీ, మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న <<17824045>>సృష్టి<<>> ఆసుపత్రి వైద్యురాలు నమ్రతను ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఫర్టిలిటీ సెంటర్ పేరుతో 2014 నుంచి అక్రమ వ్యవహారాలు నడిపినట్లు దర్యాప్తులో గుర్తించింది. గతంలో మెడికల్ లైసెన్స్ సస్పెండ్ అయినా కార్యకలాపాలు కొనసాగించినట్లు పేర్కొంది. ఇటీవల ఆమెపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది.

News February 14, 2026

10నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

image

కేరళలో రోడ్డుప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన పది నెలల పసికందు అలిన్ షెరిన్ ఐదుగురికి ప్రాణం పోసింది. ఈ నెల 5న జరిగిన ప్రమాదంలో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేరగా నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. వారి విజ్ఞప్తితో చిన్నారి తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. క్లిష్ట సమయంలోనూ పేరెంట్స్ నిర్ణయాన్ని కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసించారు.

News February 14, 2026

సిద్దిపేట: జాగ్రత్త.. బుట్టలో వేసి.. లక్షలు దోచేస్తున్నారు!

image

మ్యాట్రిమోనియల్ సైట్లు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీనివాసు హెచ్చరించారు. ప్రధానంగా NRI, పెద్ద వ్యాపారవేత్తలమని నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తున్నారని తెలిపారు. పరిచయం పెంచుకున్నాక అత్యవసరాలు, స్టాక్స్, ట్రేడింగ్‌లో భారీ లాభాలంటూ పెట్టుబడుల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారని వివరించారు.