News January 24, 2026

రాత్రి భోజనం తర్వాత ఇవి మర్చిపోవద్దు

image

రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డిన్నర్ తర్వాత కనీసం 30-60 నిమిషాల పాటు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుందని సూచిస్తున్నారు. భోజనం, నిద్ర మధ్య 2-3Hr విరామం ఉంటే మంచిదని అంటున్నారు. తిన్న వెంటనే స్నానం చేయడం, వాటర్ తాగడం మంచిది కాదని పేర్కొన్నారు. రాత్రి పూట తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు.

Similar News

News February 24, 2026

త్వరలో ప్రసూతి, వివాహ కానుకలు: సుభాష్

image

AP: ఈ-శ్రమ్ పోర్టల్‌లో రాష్ట్రం నుంచి 88.16L మంది కార్మికులు నమోదయ్యారని మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో 18.24L మంది చేరారని తెలిపారు. త్వరలో కార్మికులకు వివాహ కానుక, ప్రసూతి సాయం, మరణ, అంత్యక్రియల సమయంలో ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల కోసం సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తున్నామని అసెంబ్లీలో పేర్కొన్నారు.

News February 24, 2026

బాధితులకు మెరుగైన ట్రీట్‌మెంట్ ఇవ్వండి: సీఎం

image

AP: శ్రీకాకుళంలో డయేరియా కేసుల కలకలం నేపథ్యంలో CM CBN అధికారులతో సమీక్ష నిర్వహించారు. 32 మంది డయేరియా బారినపడ్డారని, వీరిలో 10 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. రోడ్డు రిపేర్ పనుల వల్లే నీరు కలుషితమైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన ట్రీట్‌మెంట్ ఇవ్వాలని CM ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News February 24, 2026

ఉల్లిలో ఆకుమచ్చ, పచ్చ పురుగు, కుళ్లు తెగులు నివారణ

image

ఉల్లిలో ఆకుమచ్చ తెగులు వల్ల ఆకులపై ఊదారంగు మచ్చలు ఏర్పడి ఎండిపోతాయి. దీని నివారణకు కార్బండిజం, మాంకోజెబ్ 2 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉల్లిలో ఆకు తినే పచ్చ పురుగు నివారణకు లీటర్‌ నీటికి కార్బరిల్‌ 3 గ్రాములు (లేదా) ప్రొపినోఫాస్‌ 2 mlను కలిపి పిచికారీ చేయాలి. ఇక కుళ్లు తెగులు నివారణకు మెటలాక్సిల్‌ + మాంకోజెబ్‌ 3 గ్రాములను లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.