News January 25, 2026
మంచిర్యాల: 8 మంది మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. శనివారం సీపీ కార్యాలయంలో మలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగాలకు చెందిన ఎనిమిది మంది మావోయిస్టులు ఎదుట లొంగిపోయారు. సీపీ మాట్లాడుతూ.. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అందించే పునరావాస పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
Similar News
News February 20, 2026
కామారెడ్డి నుంచి జుక్కల్కు బస్సులు

కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి జుక్కల్కు బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్ దినేశ్ తెలిపారు. ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు ట్రిప్పులు ఈ బస్సు రాకపోకలు సాగిస్తుందని, ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News February 20, 2026
కృష్ణా: తిరుపతికి వెళ్లేవారికి గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా విశాఖపట్నం(VSKP)- తిరుపతి(TPTY) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబరు 08583 VSKP- TPTY రైలు మార్చి 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం, నంబరు 08584 TPTY- VSKP మధ్య నడిచే రైలు మార్చి 3 నుంచి 31 వరకు ప్రతి మంగళవారం పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని తెలిపారు.
News February 20, 2026
ADB: నాడు అక్బరుద్దీన్.. నేడు బాల్క సుమన్

జిల్లా జైలుకు మరోమారు రాష్ట్ర స్థాయి నేత రిమాండ్పై వచ్చారు. గతంలో ద్వేషపూరిత ప్రసంగాల కేసులో జనవరి 8 2013లో అక్బరుద్దీన్ ఒవైసీ 40 రోజుల పాటు ఇక్కడ రిమాండ్లో ఉన్నారు. తాజాగా క్యాతన్పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక గొడవల నేపథ్యంలో మాజీ ఎంపీ బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఇదే జైలుకు తరలించారు. అక్బరుద్దీన్ సుదీర్ఘ కాలం ఇక్కడ ఉండగా, సుమన్ ఎన్ని రోజులు ఉంటారోనని చర్చ మొదలైంది.


