News January 25, 2026
‘మన్ కీ బాత్’లో అనంతపురం ప్రస్తావన

AP: ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని అనంతపురం గురించి ప్రస్తావించారు. నీటి ఎద్దడి పరిష్కారానికి అక్కడి ప్రజల శ్రమను అభినందించారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో పదికి పైగా జలాశయాలను పునరుద్ధరించారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 7 వేలకు పైగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు బాటలు వేశారని పొగిడారు. కాగా ప్రధాని మోదీ 130వ ‘మన్ కీ బాత్’లో ఈరోజు మాట్లాడారు.
Similar News
News February 10, 2026
యుద్ధ భయం.. 37 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన ఖమేనీ

USతో యుద్ధ భయం నేపథ్యంలో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ 37 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ వేశారు. ఈ నెల 8న ఎయిర్ఫోర్స్ కమాండర్లతో భేటీకి ఆయన హాజరుకాలేదని ఇరాన్ ఇంటర్నేషనల్ తెలిపింది. 1989లో సుప్రీంలీడర్ అయినప్పటి నుంచి ఈ మీటింగ్ను ఆయన మిస్ కాలేదు. 1979 Feb 8న ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా రుహొల్లా ఖొమేనీ(మాజీ సుప్రీంలీడర్)కి వాయుసేన అధికారులు విధేయత చూపడానికి గుర్తుగా కమాండర్లతో ఖమేనీ భేటీ అవుతుంటారు.
News February 10, 2026
బీటల్ మేకలు.. రోజూ 2 లీటర్లకు పైగా పాలు

సాధారణంగా ఒక మేక రోజుకు 500ml నుంచి లీటర్ వరకు పాలు ఇస్తాయి. కానీ బీటల్ జాతి మేకలు మాత్రం రోజూ 2 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని గురుదాస్పూర్, అమృత్సర్, ఫిరోజ్పూర్ జిల్లాల్లో స్వచ్ఛమైన బీటల్ జాతి మేకలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పాలు, మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు. పెద్ద శరీర పరిమాణం, చెవులు చదునుగా, పొడవుగా, వంకర్లు తిరిగి 15 సెంటీమీటర్ల పైనే ఉంటాయి
News February 10, 2026
‘తోతాపురి’ టన్ను రూ.1,05,000

AP: వేసవి రాకముందే మామిడి ఎగుమతులు ఊపందుకుంటున్నాయి. రేట్లు కూడా భారీగా పెరిగి రైతులకు లాభాలు తెస్తున్నాయి. NTR(D) విస్సన్నపేట నుంచి ఎగుమతి అయిన తోతాపురి మామిడి రకానికి ముంబై మార్కెట్లో రికార్డు స్థాయిలో టన్ను రూ.1,05,000 రేటు పలికింది. ఉత్తరాదిన డిమాండ్ కారణంగానే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కాగా గతేడాది సీజన్ చివరలో చిత్తూరులో తోతాపురి టన్ను రూ.12-14వేలకు పడిపోయిన విషయం తెలిసిందే.


