News January 25, 2026
సింగరేణి కార్మికులపై పన్ను భారం తగ్గించాలని వినతి

సింగరేణి కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక ప్రసాద్ తీసుకెళ్లారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూగర్భ గనుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కోల్ ఇండియాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సింగరేణిలోనూ వర్తింపజేయాలని వినతి పత్రం అందజేశారు.
Similar News
News February 15, 2026
రైతుభరోసా ఒకే విడతలో.. ?

TG: గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రభుత్వం ఒకే విడతలో రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎకరాల చొప్పున డబ్బులు విడుదల చేయడంతో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి 9 రోజుల సమయం పట్టేది. ఈసారి పెట్టుబడికి రైతులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఒకే విడతలో ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 17న రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
News February 15, 2026
కాంగ్రెస్లో చేరిన ఐదుగురు కొత్తగూడెం స్వతంత్ర కార్పొరేటర్లు

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్లో చేరగా, వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో 1, 13, 34, 42, 48వ డివిజన్ల కార్పొరేటర్లు సుగుణ, తలుగు శాంత, విజయలక్ష్మి, మణి, నరేష్ ఉన్నారు.
News February 15, 2026
పాకిస్థాన్కు ‘ధురంధర్’ డోస్!

T20 WCలో ఇవాళ కొలంబో వేదికగా జరగనున్న IND, PAK మ్యాచుకు ముందు మ్యూజికల్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారని జాతీయ క్రీడా వర్గాలు తెలిపాయి. ఇందులో ‘ధురంధర్’ సినిమా పాటల్ని ప్లే చేస్తారని, ర్యాపర్ హనుమాన్కైండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని పేర్కొన్నాయి. పాక్, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈరోజు ఆ టీమ్తో పాటు PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీకి ‘ధురంధర్’ డోస్ తప్పేలా లేదు.


