News April 27, 2024
AAP ఎమ్మెల్యేకు బెయిల్

ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ఆద్మీ MLA అమానతుల్లా ఖాన్కు బెయిల్ మంజూరైంది. రూ.15వేల పర్సనల్ బాండ్ చెల్లించి బెయిల్ పొందేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, బోర్డు ప్రాపర్టీల లీజు మంజూరుపై ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈనెల 18న ఈడీ ఖాన్ను అరెస్ట్ చేసింది. కాగా ఈనెల తొలివారంలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన AAP ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్ మంజూరు అయింది.
Similar News
News December 28, 2025
Silver.. సారీ..! Stock లేదు!

వెండి పరుగులతో పెట్టుబడి కోసం బిస్కెట్స్కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కానీ కొందామని షాపులకు వెళ్తున్న కస్టమర్లకు నిరాశే ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ షాపుల్లో సిల్వర్ బార్స్ లేవనే సమాధానం వస్తోంది. ఒకవేళ అక్కడక్కడా ఉన్నా 10గ్రా, 15g, 20g బార్స్ తప్ప వందలు, వేల గ్రాముల్లో లేవని చెబుతున్నారు. ఆర్డర్ పెడితే 4-7 రోజులకు వస్తుందని, ఆరోజు ధరకే ఇస్తామంటున్నారు. మీకూ ఇలా అయిందా? కామెంట్.
News December 28, 2025
EDలో 75పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్(<
News December 28, 2025
ఢిల్లీకి ‘డోమ్’.. శత్రువులకు చుక్కలే

ఢిల్లీ రక్షణ కోసం కేంద్రం ‘క్యాపిటల్ డోమ్’ పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్ల నుంచి నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు QRSAM, VL-SRSAM దీంట్లో కీలక పాత్ర పోషిస్తాయి. వినూత్న లేజర్ ఆయుధాలను కూడా వాడుతున్నారు. ఇవి డ్రోన్లను క్షణాల్లో కూల్చేస్తాయి. ఈ వ్యవస్థతో ఢిల్లీ గగనతలంలో శత్రువులు ఛేదించలేని ఒక రక్షణ వలయం ఏర్పడబోతోంది.


