News January 26, 2026

మదర్ డెయిరీలో ముదిరిన సంక్షోభం

image

నల్గొండ జిల్లాలోని మదర్ డెయిరీలో పాలకవర్గ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు పరాకాష్టకు చేరుకున్నాయి. 15 రోజుల్లోనే ఇద్దరు ఛైర్మన్లు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలతో మందడి ప్రభాకర్ రెడ్డి తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. డెయిరీకి ఉన్న ₹28 కోట్ల అప్పు విషయంలో బ్యాంకులు సీరియస్ అయ్యాయి. ఫిబ్రవరి 1 లోగా ₹10 కోట్లు చెల్లించకుంటే డెయిరీని సీజ్ చేస్తామని హెచ్చరించాయి.

Similar News

News February 22, 2026

NLG: SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

image

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మట్టి దిబ్బల కిందే తమ వారు కలిసిపోయారన్న వేదనలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు.

News February 22, 2026

NLG: ఈనెల 27 వరకు పెన్షన్ల పంపిణీ: డీఆర్డీవో

image

ఆసరా పింఛన్లను 27వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో శేఖర్ రెడ్డి తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలకు చేయూత, ఆసరా పింఛన్లను ఆయా పోస్టాఫీసులలో అందజేయనున్నట్లు తెలిపారు. పింఛనుదారులు పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ కార్యాలయాల్లో పొందాలని, దళారులను నమ్మవద్దని పేర్కొన్నారు.

News February 22, 2026

నల్గొండలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

నల్గొండ జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 48 కేంద్రాలలో మొత్తం 27,905 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని జిల్లా ఇంటర్ అధికారి దస్రు నాయక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించారు.