News January 27, 2026

నిద్ర నాణ్యత పెంచుకోండిలా!

image

పగలంతా హుషారుగా పనిచేయాలంటే రాత్రి నాణ్యమైన నిద్ర అవసరం. అందుకు రోజూ ఒకే టైమ్‌కు నిద్ర పోవడం, లేవడం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ దీన్ని పాటించాలంటున్నారు. పడుకునే చోట లైట్లు పడకుండా, శబ్దాలు రాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. రాత్రి వేళ లైట్ ఫుడ్ తీసుకోవడంతో పాటు నిద్రకు 30-60ని. ముందు స్క్రీన్ చూడటం ఆపాలని సూచిస్తున్నారు. ఒత్తిడికి గురయ్యే విషయాల గురించి ఆలోచించొద్దంటున్నారు.

Similar News

News February 23, 2026

INC: అన్ని రాష్ట్రాల్లోనూ అంతర్గత కుమ్ములాటలు

image

ప్రతిపక్షంగా NDAపై పోరాడాల్సిన INC అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అధికారంలో ఉన్న కర్ణాటకలో సిద్దరామయ్య, శివకుమార్‌ల విభేదాలు తారస్థాయికి చేరాయి. ఝార్ఖండ్‌లో JMMతోనూ విభేదాలున్నాయి. అస్సాం, బిహార్లలో సీనియర్ నేతలు భూపేన్ కుమార్, షకీల్ అహ్మద్ రాజీనామా చేశారు. WBలో ఉనికి కోల్పోగా, GJ, UPలోనూ అదే స్థితికి చేరుతోంది. TNలో సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేదు. అటు కేరళలోనూ ఇంటర్నల్ విభేదాలున్నాయి.

News February 23, 2026

ఎండల్లో వర్షాలు.. పొంచి ఉన్న జ్వరాల ముప్పు

image

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పగటిపూట ఎండలు దంచికొడుతుండగా రెండ్రోజుల నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఇలా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు వర్షంలో తడవకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. తాజా ఆహారంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగాలంటున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటే వైరల్ ఫీవర్లు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

News February 23, 2026

మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్&టీతో ‘సెటిల్మెంట్’

image

TG: హైదరాబాద్ మెట్రో రైలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎల్&టీకి ఉన్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వమే భరిస్తుందని సమాచారం. అలాగే ఆ సంస్థకు ఈక్విటీ కింద రూ.2,000 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండో దశ విస్తరణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు చర్యలు చేపట్టనుంది.