News January 27, 2026

మెదక్ జిల్లాలో విషాదం

image

మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ బత్తిని బ్రహ్మయ్య సోమవారం అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, కర్తవ్యనిష్ఠకు ఆయన చిరునామాగా నిలిచారు. సుదీర్ఘ సేవా కాలంలో ప్రజల విశ్వాసాన్ని సంపాదించి ఆదర్శ అధికారిగా గుర్తింపు పొందారు. ఆయన మరణ వార్తతో రేగోడ్ మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బ్రహ్మయ్య సేవలను పలువురు ప్రజాప్రతినిధులు, సహోద్యోగులు స్మరించుకున్నారు‌.

Similar News

News January 29, 2026

మేడారంలో మొబైల్ అంబులెన్సుల సేవలు!

image

మేడారం జాతర సందర్భంగా భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మొబైల్ అంబులెన్సులు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. ద్విచక్ర వాహనాలపై సన్నద్ధంగా తిరుగుతున్న వైద్య సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఘటనా స్థలానికే చేరుకుని బాధితులకు తక్షణ ప్రథమ చికిత్స అందిస్తున్నారు. జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ సులభంగా చేరుకునే విధంగా ఈ బైక్ అంబులెన్సులను వినియోగిస్తున్నారు.

News January 29, 2026

సోలార్ విద్యుత్ పై ప్రగతి సాధించాలి: కలెక్టర్

image

PM ముఫ్తీ బిజిలీ యోజన & RDSS పథకాలను సంబంధిత అధికారులు, బ్యాంకర్స్ సమన్వయంతో పనిచేసి మంచి ప్రగతిని సాధించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు.
బుధవారం ఏలూరు కలెక్టరేట్‌లో ఆమె అధికారులతో సమీక్షించారు. ప్రతి సచివాలయంలో సోలార్ విద్యుత్ పై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. 100 అప్లికేషన్లు సేకరించి కనెక్షన్లు ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న అప్లికేషన్స్ వెంటనే పూర్తి చేయాలన్నారు.

News January 29, 2026

రాష్ట్రంలో తూ.గో జిల్లాకు ద్వితీయ స్థానం

image

RTC నిర్వహించిన లాజిస్టిక్స్ డోర్ డెలివరీల్లో తూ.గో జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. అందుకు విశేషంగా కృషి చేసిన జిల్లా ప్రజా రవాణా అధికారి వై.ఎస్.ఎన్ మూర్తిని విజయవాడ కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావులు అభినందించారు. ప్రశంసా పత్రం, రివార్డుతో డీపీటీఓ మూర్తిని సత్కరించారు. ఆర్టీసీ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.