News January 27, 2026
NGKL జిల్లాలో 3 మున్సిపాలిటీలు.. 80, 757 ఓటర్లు.!

మున్సిపల్ ఎన్నికల <<18974641>>నగారా<<>> మోగింది. నాగర్ కర్నూల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో 65 వార్డులకు 131 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 80,757 మంది ఓటర్లు ఉన్నారు. NGKLలో 24 వార్డులు, 35,378 ఓటర్లు, కొల్లాపూర్లో 19 వార్డులు, 19,356 ఓటర్లు, కల్వకుర్తిలో 22 వార్డులు, 26,023 ఓటర్లు ఉన్నారు. కాగా FEB 11న పోలింగ్, 13న ఫలితాలు వెలువడనున్నాయి.
Similar News
News February 9, 2026
మార్చి 31న సెలవు రద్దు: RBI

మార్చి 31(మహావీర్ జయంతి)న బ్యాంకుల సెలవు రద్దు చేస్తూ RBI ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం హాలీడే ఉన్నా ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆ రోజున పనివేళలు కొనసాగించాలని తెలిపింది. 2025-26 FYలోపే ప్రభుత్వ రసీదులు, చెల్లింపులకు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగినట్లు పరిగణనలోకి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సాధారణ కార్యకలపాలపై కస్టమర్లు బ్రాంచ్ను ధ్రువీకరించుకోవడం ఉత్తమం.
News February 9, 2026
కర్నూలు: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రేపు ఇంటర్వ్యూ!

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 10న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. 11 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని చెప్పారు.
News February 9, 2026
ఉయ్యూరు తిరునాళ్లలో జనసంద్రం!

కృష్ణాజిల్లా ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్లకు భక్తులు పోటెత్తారు. చివరి ఆదివారం కావడంతో సుమారు 60 వేల-80 వేల మంది దర్శనాలకు వచ్చారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో 500 మందికి పైగా సిబ్బందితో భద్రత ఏర్పాట్లను చేపట్టారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ రద్దీ అర్ధరాత్రి వరకు కొనసాగింది.


