News January 27, 2026
ఫిబ్రవరి తొలివారంలో రైతులకు రూ.2వేలు?

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అదే వారంలో పీఎం కిసాన్ పథకంలో భాగంగా అన్నదాతల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేస్తుందని సమాచారం. మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలను అన్నదాతలకు అందించే అవకాశం ఉంది. కాగా రైతులు తప్పనిసరిగా E-KYC చేయించుకోవాలి. లేదంటే డబ్బులు జమ కావు.
Similar News
News February 13, 2026
క్యాంప్ రాజకీయాలు.. SEC కీలక ఆదేశాలు

TG: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ పార్టీలు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టాయి. అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘ఎన్నికైన అభ్యర్థికి వెంటనే అధికారిక సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. దాన్ని తీసుకున్న వ్యక్తి సంతకం చేయాలి’ అని పేర్కొంది. దీంతో దూరప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.
News February 13, 2026
ఇంపోర్టెడ్ ఆపిల్స్ తింటున్నారా?

‘ఇంపోర్టెడ్’ ఆపిల్స్ కంటే మన దేశీ కశ్మీరీ, హిమాచల్ ఆపిల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. విదేశీ పండ్లు నెలల తరబడి నిల్వ ఉండటం వల్ల వాటిలోని విటమిన్-C 85% వరకు తగ్గిపోతుందని తెలిపారు. మన ఆపిల్స్లో గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్, సహజమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయని వివరించారు. మెరిసే వ్యాక్స్ పూత ఉన్న విదేశీ పండ్ల కంటే తాజాగా దొరికే స్వదేశీ ఆపిల్స్ తీసుకోవాలని చెబుతున్నారు.
News February 13, 2026
శివ నామాలు అర్థాలు ‘‘శూలపాణి’’

శివుడి ఆయుధం త్రిశూలం. దీనిని చేతిలో ధరించిన వాడు కాబట్టి ఆయన ‘శూలపాణి’ అయ్యాడు. త్రిశూలంలోని మూడు కొనలు సత్వ, రజ, తమ గుణాలకు; అలాగే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంకేతం. వాటన్నింటినీ తన అధీనంలో ఉంచుకుని లోకాన్ని రక్షించేవాడు శివుడు. మనలోని అరిషడ్వర్గాలను తన శూలంతో సంహరించి, మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం నిరంతరం సిద్ధంగా ఉండే రక్షకుడు ఆయన.


