News April 27, 2024
పార్లమెంటు ఎన్నికల్లో కారు తుక్కు తుక్కుఅవుతుంది: పొంగులేటి

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు తుక్కు తుక్కుకానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలోనే లక్ష ఓట్ల మెజారిటీ అందిద్దామని చెప్పారు. గతంలో BRS మాయమాటలు నమ్మి వివిధ పార్టీల నుంచి చేరి అక్కడ ఇమడలేక కాంగ్రెస్లో చేరిన వారందరికీ ఆహ్వానం పలికారు.
Similar News
News January 21, 2026
ఖమ్మం: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వసతి సౌకర్యంతో కూడిన ఉచిత నాణ్యమైన విద్యను మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 20, 2026
‘ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వేకు సిద్ధం కావాలి’

రాష్ట్రంలో ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సిసిఎల్ఎ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లైసెన్డ్ సర్వేయర్లను కేటాయించి, రెండో గెజిట్ నోటిఫికేషన్ తర్వాత శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని సూచించారు. భూభారతి కింద చేపట్టే ఈసర్వేకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
News January 20, 2026
ఖమ్మం: ఇంటర్ పరీక్షలకు సిద్ధం.. 66 కేంద్రాల ఏర్పాటు

ఖమ్మం జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 35,188 మంది విద్యార్థుల కోసం 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షించి, కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు DIEO రవిబాబు తెలిపారు.


