News January 28, 2026
మున్సి’పోల్స్’.. నేటి నుంచి నామినేషన్లు

TG: మున్సిపల్ ఎన్నికల <<18974641>>నామినేషన్ల<<>> ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 30 వరకు కొనసాగనుంది.
నామినేషన్కు కావాల్సినవి: నామినేషన్ ఫారం, పుట్టిన తేదీ ధ్రువీకరణ (SSC/ఓటర్ ఐడీ/ఆధార్ జిరాక్స్), కుల ధ్రువీకరణ పత్రం (రిజర్వుడు స్థానాల్లో), నామినేషన్ డిపాజిట్, సెల్ఫ్ అఫిడవిట్ (ఆస్తులు, విద్యార్హతలు, కేసులు), కొత్త బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, సెల్ఫ్ డిక్లరేషన్, ప్రాపర్టీ నో డ్యూ సర్టిఫికెట్, ఫొటోలు.
Similar News
News February 2, 2026
లోకేశ్ నన్ను హతమర్చాలని చూస్తున్నారు: జోగి

AP: రెడ్ బుక్ రాజ్యాంగంతో లోకేశ్ తనను మట్టుబెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే ఆయనదే బాధ్యత అన్నారు. లోకేశ్ ఆదేశంతో MP చిన్ని రౌడీలతో నా ఇంటిపై దాడి చేయించారు. దాడికి ముందు TDP నేతలతో DCP, CI చర్చించారు. TDP గూండాలు ర్యాలీగా పెట్రోలు సీసాలు, కర్రలతో వస్తుంటే వారికి పోలీసులు ఎస్కార్ట్గా వచ్చారు. ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడక మానరు’ అని హెచ్చరించారు.
News February 2, 2026
HYD TO BLR.. 2 గంటల్లో వెళ్లిపోవచ్చు: అశ్వినీ వైష్ణవ్

దేశంలో హైస్పీడ్ రైళ్లు గంటకు 350KM వేగంతో ప్రయాణిస్తాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో, పుణేకు 1.45 గంటల్లో, చెన్నైకి 2.55 గంటల్లో చేరుకోవచ్చన్నారు. హైస్పీడ్ కారిడార్తో AP-TG-TN మధ్య ఎకానమీ, హెల్త్, టూరిజం అభివృద్ధి చెందుతాయని చెప్పారు. హైస్పీడ్ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు గేమ్ ఛేంజర్గా మారతాయని పేర్కొన్నారు.
News February 2, 2026
సహజ సేద్యంతో ఎక్కువ లాభం.. ఎందుకంటే?

వ్యవసాయంలో సహజ సేద్య పద్ధతుల వైపు నేడు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు తగ్గడమే. సహజ సేద్యంలో లాభాలు తొలుత ఆలస్యమైనా, కొంత కాలానికి సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులతో సమానంగా ఆదాయం వస్తుంది. క్రిమిసంహారక మందులు, ఎరువులపై వెచ్చించే వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణానికి, మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మహిళలు ఎక్కువగా ఈ విధానం అనుసరిస్తున్నారు.


