News January 28, 2026

ప్రకాశం: రైలొచ్చిందంటే..అన్నీ అవుతాయ్.!

image

నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే‌లైన్ ప్రాజెక్ట్‌తో ఎన్నో దశాబ్దాల కల నెరవేరనుంది. దీంతో ఎన్నో గ్రామాల ఆశ ఇప్పుడు పట్టాల మీద పరుగులు తీస్తోందని BJP ‘X’ వేదికగా ట్వీట్ చేసింది. ఇప్పటికే 88.65 KM పూర్తైన రైల్వే లైన్‌తో దర్శి, పొదిలి, కనిగిరి, ఆత్మకూరు, రాపూరులు భారత రైల్వే మ్యాప్‌పై గర్వంగా నిలుస్తున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం పట్టాలు వేసింది రైలుకే కాదు.. బంగారు భవిష్యత్తుకి అని ‘X’లో కొనియాడారు.

Similar News

News February 23, 2026

ప్రకాశం: క్రికెట్ బెట్టింగ్.. SI పేరుతో బెదిరింపులు

image

ప్రకాశం(D) జరుగుమల్లి(M) చింతలపాలెంకి చెందిన శ్రీనివాసరావు, అల్లుడు హేమంత్ క్రికెట్ బుకీ నడుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనను బెట్టింగులకు అలవాటు చేసి, తనవద్ద చెక్కులు తీసుకొని నగదు అప్పు ఇచ్చి బెట్టింగులు పెట్టించారని సోమవారం జిల్లా గ్రీవెన్స్‌లో ఓ బాధితుడు వాపోయాడు. నగదుకోసం హేమంత్ సోదరుడు ఒంగోలుని ఓ రైల్వే SI పేరుచెప్పి బెదిరిస్తున్నారని, న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు.

News February 23, 2026

మోటుమాల: మట్టికుప్పను ఢీకొని యువకుడి మృతి

image

కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్‌ మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది ధ్రువీకరించారు.

News February 23, 2026

మోటుమాల: మట్టికుప్పను ఢీకొని యువకుడి మృతి

image

కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్‌ మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది ధ్రువీకరించారు.