News January 28, 2026
వారసుడిని ప్రకటించే పనిలో ఇరాన్ సుప్రీం లీడర్

USA యుద్ధనౌకలు సమీపించడంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వారసుడిని నిర్ణయించే పనిలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే బంకర్లో దాక్కున్న ఆయన, USకు పట్టుబడ్డా, అంతమైనా పాలన ఆగకుండా ముగ్గురి పేర్లు షార్ట్ లిస్ట్ చేశారని తెలుస్తోంది. ఇందులో తన కొడుకు మొజ్తబా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఫౌండర్ మనవడు రుహొల్లా తదితర పేర్లు విన్పిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పీఠమెక్కే ఎవరికైనా పాలన కత్తుల వంతెనపై కవాతే.
Similar News
News February 21, 2026
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూపులే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో సీనియర్ ఫీల్డ్ కమాండర్ సహా 10 మంది మరణించగా 50 మందికి గాయాలయ్యాయి. ఇరు దేశాల మధ్య 2024 నవంబర్లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అతిపెద్ద దాడి అని అంతర్జాతీయ మీడియా వెల్లడించాయి. తమ దేశంపై దాడులకు ప్రణాళికలు వేస్తున్నారనే పక్కా సమాచారంతోనే రివర్స్ అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
News February 21, 2026
రైతు బంధు నిధులు ఎక్కడ: హరీశ్ రావు

TG: రైతుబంధు పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పారు. అటు మెదక్ మున్సిపాలిటీలో BRS కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారని మండిపడ్డారు. పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
News February 21, 2026
T20WC: భారీ వర్షం.. మ్యాచ్ రద్దు

కొలంబో: సూపర్-8లో న్యూజిలాండ్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దైంది. టాస్ పడిన కాసేపటికే వాన మొదలు కాగా ఇప్పటి వరకు తగ్గుతుందేమో అని వేచి చూశారు. ప్రస్తుతం వర్షం మరింత పెద్దది కావడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు టీమ్లు చెరొక పాయింట్ పంచుకోనున్నాయి. అటు రేపు పల్లెకెలెలో ఇంగ్లండ్-శ్రీలంక, అహ్మదాబాద్లో ఇండియా-సౌతాఫ్రికా తలపడనున్నాయి.


