News January 28, 2026
మేడారం బస్సుల్లో మేకల టికెట్ @400

మొక్కులు చెల్లించుకునే భక్తులు మేడారానికి తీసుకెళ్లే గొర్రెలు, మేకలకు బస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. జనగామ నుంచి మేడారానికి వెళ్లే భక్తుల నుంచి ఒక్కో మేక/గొర్రెకు రూ.400 వసూల్ చేస్తున్నారు. పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.250 వసూల్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా గొర్రె/మేకలకు ఛార్జీలు తీసుకోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు టికెట్ ధర రూ.400 చాలా ఎక్కువని ప్రశ్నిస్తున్నారు.
Similar News
News February 21, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,910 పెరిగి రూ.1,59,280కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,750 ఎగబాకి రూ.1,46,000 పలుకుతోంది. అటు వెండి ధర ఏకంగా రూ.20వేలు పెరిగింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 21, 2026
భీమవరం: పంట కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

భీమవరం మండలం యనమదుర్రులోని సూర్యమిత్ర ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. సదరు ఫ్యాక్టరీకి చెందిన బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యమిత్ర ఫ్యాక్టరీ బస్సుగా దీన్ని గుర్తించినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.
News February 21, 2026
నేడు భాషా దినోత్సవం.. ఓరుగల్లుకు ప్రత్యేకం

అంతర్జాతీయ భాషా దినోత్సవం FEB 21 సందర్భంగా తెలుగు భాషా వైభవానికి ప్రతీకగా WGL నిలుస్తోంది. కాకతీయుల కాలం నుంచే శాసనాలు, సాహిత్య సంపదతో ఈ నగరం భాషా వికాసానికి కేంద్రంగా ఉంది. ప్రముఖ కవి పాల్కురికి సోమనాథుడు వంటి మహనీయుల సాహిత్య వారసత్వం ఇక్కడి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కాకతీయ విశ్వవిద్యాలయం భాషా పరిశోధన, అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఓరుగల్లు భాషా సంస్కృతికి చిరస్మరణీయ కేంద్రం.


