News April 28, 2024
ముంబై ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు

ముంబై ఎయిర్పోర్టు టెర్మినల్-1లో బాంబు ఉందంటూ వచ్చిన ఓ ఫోన్ కాల్, విమానాశ్రయ అధికారులను పరుగులు పెట్టించింది. టెర్మినల్ అంతా జల్లెడ పట్టి బాంబు లేదని నిర్ధారించుకున్న అనంతరం వారు ఊపిరి పీల్చుకున్నారు. అది ఆకతాయిల బెదిరింపు కాల్ కావొచ్చని తెలిపారు. ఓ ఉద్యోగినికి ఆ కాల్ వచ్చిందని వెల్లడించారు. బాంబు స్క్వాడ్తో తనిఖీల అనంతరం కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.
Similar News
News January 11, 2026
ఇంటికి చేరుకోవడమే పెద్ద ‘పండుగ’

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ట్రాఫిక్, మరోవైపు సమయానికి బస్సులు, రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటికి చేరుకోవడమే పెద్ద పండుగగా భావిస్తున్నారు. VJA-HYD హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. అటు HYDలోని బస్టాండ్లలో వచ్చిన వెంటనే బస్సులు కిక్కిరిసిపోతుండటంతో పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.
News January 11, 2026
సారీ.. ఆ మెయిల్స్ను పట్టించుకోవద్దు: డేటా లీక్పై ఇన్స్టాగ్రామ్

యూజర్ల సెన్సిటివ్ <<18820981>>డేటా లీక్<<>> అయినట్లు వచ్చిన వార్తలను ఇన్స్టాగ్రామ్ ఖండించింది. యూజర్లు పాస్వర్డ్ మార్చుకోవాలని తమ పేరుతో వచ్చిన మెయిల్స్ను పట్టించుకోవద్దని కోరింది. అలా మెయిల్స్ రావడానికి కారణమైన సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది. ప్రతిఒక్కరి ఇన్స్టా ఖాతా సేఫ్గా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా క్రియేట్ అయిన గందరగోళానికి క్షమాపణలు చెప్పింది.
News January 11, 2026
ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

AP: ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నారు. 13,257 గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాధి నిరోధక టీకాలను అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే పాడిరైతులకు పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.


